Bihar woman: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య

భార్యను హత్య చేసినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడో భర్త. కానీ, చిత్రమేంటంటే ఆ భార్య చనిపోలేదు. ప్రియుడితో కలిసి పారిపోయింది.

Bihar woman: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య

Bihar Woman

Bihar woman: భార్యను హత్య చేసినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్నాడో భర్త. కానీ, చిత్రమేంటంటే ఆ భార్య చనిపోలేదు. ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ వింత ఘటన బిహార్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్, మోతిహరి జిల్లాకు చెందిన శాంతి దేవికి, దినేష్ రామ్‌తో 2016లో పెళ్లి జరిగింది. అయితే, గత ఏప్రిల్ 19న శాంతి దేవి ప్రియుడితో కలిసి పంజాబ్‌లోని జలంధర్ పారిపోయింది. శాంతిదేవి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, శాంతిదేవి భర్త దినేష్ రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Bihar : గాలి వానకు కూలిపోయిన నిర్మాణంలో ఉన్న వంతెన

శాంతిదేవిని, దినేష్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఇటీవల అదనపు కట్నం కోసం వేధించాడని, ఆమె కోసం అన్నిచోట్లా వెతికినా దొరకలేదని, దినేష్ రామే తమ కూతురును చంపి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు హత్యా నేరం కింద దినేష్‌ రామ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం దినేష్ రామ్ జైల్లో ఉన్నాడు. అయితే, ఈ కేసు విషయంలో పోలీసులకు ఇంకా ఏదో అనుమానం వచ్చింది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ సాయంతో, శాంతి దేవి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి వెతికారు. అక్కడ శాంతి దేవి ప్రియుడితో కలిసి కనిపించింది. పోలీసులు శాంతిదేవిని మోతిహరికి తీసుకొచ్చి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.