Chiranjeevi: మెగాస్టార్ నయా ప్లాన్.. ఫ్యాన్స్కు పండగే!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ఫాదర్’.....
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ఫాదర్’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తున్న చిరు, ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, దర్శకుడు బాబీ డైరెక్షన్లో మెగా154 సినిమాల్లో నటిస్తూ చిరు బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిరు భావిస్తున్నాడు.
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
అయితే ఈ సినిమాలతో పాటు ప్రేక్షకులకు, తన అభిమానులకు దగ్గరయ్యేందుకు చిరు నయా ప్లాన్ వేస్తున్నాడట. ప్రస్తుతం ఓటీటీలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో చిన్న హీరోలు మొదలుకొని, బాలయ్య లాంటి స్టార్ హీరోల వరకు ఓటీటీల్లో ఎంట్రీ ఇచ్చి తమ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం పలు బడా ఓటీటీ ప్లాట్ఫాంలతో నయా కంటెంట్ కోసం చిరు సంప్రదింపులు జరుపుతున్నారట. కంటెంట్ బాగుంటే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు చిరు రెడీ అంటున్నారు.
Chiranjeevi : కృష్ణవంశీ కోసం కవిత్వాలు చదువుతున్న మెగాస్టార్..
దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇస్తాడా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చిరుకు నచ్చి, ఆయన మెచ్చే కంటెంట్ను ఏ ఓటీటీ ప్లాట్ఫాం అందిస్తుందో చూడాలి. ఇక చిరు నటిస్తున్న గాడ్ఫాదర్ చిత్రంలో చిరు సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.