Suhasini : చిరంజీవి, సుహాసిని స్పెషల్ వాట్సాప్ గ్రూప్.. అందులో ఎవరెవరు ఉంటారో తెలుసా??

సుహాసిని మాట్లాడుతూ.. ''పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. 80లలో కలిసి నటించిన వారంతా...............

Suhasini : చిరంజీవి, సుహాసిని స్పెషల్ వాట్సాప్ గ్రూప్.. అందులో ఎవరెవరు ఉంటారో తెలుసా??

Chiranjeevi (1)

 

Chiranjeevi :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని ప్రస్తుతం తల్లి, అక్క, అత్త పాత్రలు పోషిస్తూ బిజీగానే ఉంది. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది సుహాసిని. 80లలో నటించిన అప్పటి హీరోలు, హీరోయిన్స్ అందరూ ఒక బ్యాచ్ గా కలుస్తూ ఉంటారన్న సంగతి మనకి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఏదో ఒక కలర్ థీమ్ తో డ్రెస్ లు వేసుకొని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడకి చెందిన 80లలో ఉన్న స్టార్లు అంతా ఎవరో ఒకరి ఇంట్లో కలిసి ఎంజాయ్ చేస్తారు.

అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ రీయూనియన్ లో చిరంజీవి, వెంకటేష్, నరేష్, సుమన్, నాగార్జున, మోహన్ లాల్, రజినీకాంత్, మమ్ముట్టి, అంబరీష్, జయరాం, సుహాసిని, ఖుష్బూ, రాధిక, రాధా, సుమలత, రేవతి.. ఇలా చాలా మంది సౌత్ యాక్టర్స్ కలుస్తూ ఉంటారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుహాసిని దీని గురించి మాట్లాడారు.

Koratala Shiva : ఆచార్య కోసం.. 20 ఎకరాల్లో సృష్టించిన ధర్మస్థలి..

సుహాసిని మాట్లాడుతూ.. ”పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. సుమలత, ఖుష్బూ, రేవతి, లిజీ, రేఖ, పూర్ణిమ.. ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. 80లలో కలిసి నటించిన వారంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా అందరికి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇందులో చిరంజీవి, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, వెంకటేష్, నేను, సుమలత, రాధిక, రాధా.. ఇలా దాదాపు 30 మంది పైనే మా వాట్సాప్‌ గ్రూప్‌ లో ఉన్నారు. మేమంతా అప్పటి సంగతులు షేర్ చేసుకుంటూ ఇప్పటి సంగతులు కూడా పంచుకుంటాము” అని తెలిపారు.