Chiranjeevi : రవితేజతో సినిమా చేయాలి అంటే కోపం వచ్చేస్తుంది.. చిరంజీవి!

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే మూవీ సెట్ లో రవితేజ చేసే పనులకు కోపం వచ్చేస్తుంది అంటూ చిరంజీవి వైరల్ కామెంట్స్ చేశాడు.

Chiranjeevi : రవితేజతో సినిమా చేయాలి అంటే కోపం వచ్చేస్తుంది.. చిరంజీవి!

chiranjeevi viral comments on raviteja

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు అండ్ రవితేజ ఇద్దరు హాజరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇక ఈ ఫంక్షన్ లో చిరంజీవి, రవితేజపై వైరల్ కామెంట్స్ చేశాడు.

Ravi Teja : బాధ పడతారు ఏమో గాని బయటపడరు.. రవితేజ!

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. “నన్ను ఎంతగానో అభిమానించే రవితేజతో అన్నయ్య లాంటి సినిమాలో నటించడం. ఆ తరువాత ఇన్నాళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు నటించడం ఎంతో ఆనందంగా ఉంది. అయితే రవితో సినిమా చేయాలంటే కోపం వచ్చేస్తుంది. సీన్ జరుగుతున్నప్పుడు యాక్టింగ్ మీద ద్రుష్టి పెట్టనివ్వడు. ఓ కబురులు చెప్పేసి, నవ్వించేసి ఎంటర్‌టైన్ చేస్తూ సెట్ లో గందరగోళం చేసే చాలా అల్లరి పిల్లోడు” అంటూ రవితేజ గురించి చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. రవితేజ సెకండ్ హాఫ్ లో వస్తాడు దుమ్ము దులిపేస్తాడు. రవి వచ్చిన దగ్గర నుండి సినిమా మరో స్థాయికి వెళ్లిపోయింది. క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది అనేది మీరు తప్పక చూడాల్సిందే అంటూ తెలియజేశాడు. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. కేథ‌రిన్ థ్రెసా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుండగా, ఊర్వశి రౌటెలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది.