UP : బొమ్మ అనుకున్నావా ? పిల్లాడిని బల్డింగ్‌‌పై నుంచి వేలాడదీసిన హెడ్ మాస్టర్

మీర్జాపూర్ లోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుడిని హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ బిల్డింగ్ మీద నుంచి వేలాడదీశాడు.

UP : బొమ్మ అనుకున్నావా ? పిల్లాడిని బల్డింగ్‌‌పై నుంచి వేలాడదీసిన హెడ్ మాస్టర్

Up School

Class 2 Student Hanged : ఈ మధ్యకాలంలో స్కూళ్లో పిల్లలను హింసించడం పరిపాటై పోయింది. చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. వారిని దారుణంగా కొడుతున్నారు. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. కానీ ఓ హెడ్మాస్టర్ రెండో తరగతి చదువుతున్న పిల్లాడిని బిల్డింగ్ పై నుంచి వేలాడదీశాడో హెడ్ మాస్టర్. అక్కడున్న విద్యార్థులు అరవడంతో ఆ పిల్లాడిని అమాంతం పైకి లేపాడు. ఏ మాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Read More : JioPhone Next Price : దీపావళికి జియో ఫోన్ నెక్ట్స్..ధర ఎంతో తెలుసా

మీర్జాపూర్ లోని ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుడిని హెడ్ మాస్టర్ మనోజ్ విశ్వకర్మ బిల్డింగ్ మీద నుంచి వేలాడదీశాడు. కేవలం ఓ చేత్తో కాలును పట్టుకుని కిందకు వేలాడదీయడంతో..ఆ పిల్లాడు గాలిలో వేలాడుతూ భయంతో కేకలు వేయసాగాడు. వెంటనే ఇతర గదుల్లో ఉన్న పిల్లలు బయటకు వచ్చి భయపడిపోయారు. కేకలు వేయడంతో…పిల్లాడిని పైకి లేపాడు. అక్కడున్న కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Read More : PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

విషయం తెలుసుకున్న ఆ పిల్లాడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో…అతడిని అరెస్టు చేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద బుక్ చేశారు. దీనిపై హెడ్ మాస్టర్ స్పందించినట్లు సమాచారం. సోనూ చాలా అల్లరిపిల్లాడని, తుంటరి పనులు చేస్తుంటడమే కాకుండా..తోటి విద్యార్థులను, టీచర్లను కూడా కొరుకుతాడని వెల్లడించినట్లు తెలుస్తోంది. కొంచెం హద్దులో పెట్టాలని అతడి తండ్రే చెప్పడంతో…భయం ఉండాలని అలా చేయడం జరిగిందని చెప్పినట్లు సమాచారం.