KCR : తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన రెండు రోజులు పొడిగింపు

షెడ్యూల్ ప్రకారం సీఎం రేపు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఐతే.. షెడ్యూల్ ను 2 రోజులు పొడిగించినట్టు అధికారులు సమాచారం ఇచ్చారు.

KCR : తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన రెండు రోజులు పొడిగింపు

Cm Kcr Delhi Tour

తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. నిన్న సెప్టెంబర్ 2 గురువారం రోజున… ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ భవన నిర్మాణానికి భూమిపూజలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. సీఎంతో పాటు… మంత్రులు, నేతలు , ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఢిల్లీ టూర్ సందర్భంగా… ప్రధాని సహా… పలు కీలక శాఖల కేంద్రమంత్రులను కలవాలని సీఎం నిర్ణయించారు. దీంతో.. షెడ్యూల్ మరో 2 రోజులు పొడిగించారు అధికారులు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్రం గెజిట్ తోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ చర్చిస్తారని సమాచారం.

షెడ్యూల్ ప్రకారం సీఎం రేపు హైదరాబాద్ రావాల్సి ఉంది. ఐతే.. షెడ్యూల్ ను 2 రోజులు పొడిగించినట్టు అధికారులు సమాచారం ఇచ్చారు. రేపు కూడా ఢిల్లీలో ఉండనున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. హోంశాఖ పరిధిలోని అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.