Himachal Pradesh: బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్.. 24 స్థానాల్లో విజయకేతనం

పార్టీ నిర్ణయాత్మక విజయానికి కారణమైన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు జోరును కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలిచారు

Himachal Pradesh: బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్.. 24 స్థానాల్లో విజయకేతనం

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. భారతదేశంలోని పురాతన మున్సిపల్ కార్పొరేషన్లలో ఒకటైన సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ఘన విజయం సాధించింది. మొత్తం 34 వార్డులకు గాను కాంగ్రెస్‌ 24 స్థానాల్లో విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిమ్లా నుంచి కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఇది జరిగిన 32 ఏళ్ల తర్వాత.. చాలా దూకుడుగా ప్రచారం చేశారు. 2017 నుంచి ఈ కార్పొరేషన్ బీజేపీ ఆధీనంలో ఉంది.

Karnataka Polls: ‘బజరంగ్ భలి’ దెబ్బకు మాట మార్చిన కాంగ్రెస్.. ‘బజరంగ్ దళ్’‭ను బ్యాన్ చేస్తామని అనలేదంటూ బుకాయింపు

10 ఏళ్ల తర్వాత పార్టీ గుర్తుపై ఎన్నికలు జరిగిన సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌లో చారిత్రాత్మక ఆధిక్యత సాధించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ ఆదేశం తమ ప్రభుత్వ అభివృద్ధి రాజకీయాలపై రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో సీపీఎం ఒక వార్డు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. సీపీఎం తన విద్యార్థి విభాగం, స్టూడెంట్స్ ఎస్‌ఎఫ్‌ఐకి కంచుకోటగా ఉన్న సమ్మర్ హిల్ వార్డును మాత్రమే గెలుచుకుంది. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి ఈ స్థానంలో గెలిచిన అభ్యర్థి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

Manipur violence: కనిపిస్తే కాల్చేయండి.. మణిపూర్‭ అల్లర్ల నేపథ్యంలో కఠిన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

పార్టీ నిర్ణయాత్మక విజయానికి కారణమైన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు జోరును కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలిచారు. బీజేపీ 23 వార్డుల నుంచి, కాంగ్రెస్‌ 18 నుంచి మహిళా అభ్యర్థులను బరిలోకి దింపారు. రెండు పార్టీలు మొత్తం 34 వార్డుల నుంచి పోటీ చేశాయి. ఇక ఆప్ 21 స్థానాల్లో, సీపీఎం నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి.