Adipurush: క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మరో సినిమాకు సీక్వెల్ సిద్ధం?

రాధేశ్యామ్ సంగతెలా ఉన్నా.. రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇప్పుడు దూకుడు ఆగడమే లేదు. పాన్ ఇండియా దర్శకులతో ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్..

Adipurush: క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మరో సినిమాకు సీక్వెల్ సిద్ధం?

Adipurush

Adipurush: రాధేశ్యామ్ సంగతెలా ఉన్నా.. రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇప్పుడు దూకుడు ఆగడమే లేదు. పాన్ ఇండియా దర్శకులతో ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం వరస షెడ్యూల్స్ తో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా రెగ్యులర్ షూటింగ్ దశలో ఉన్నాయి. సలార్ వచ్చే ఏడాదే విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్

ఇక అంతకన్నా ముందే వచ్చే ఏడాది జనవరిలోనే ఆదిపురుష్ విడుదల చేస్తామని దర్శకుడు ఓంరౌత్ ఇప్పటికే ప్రకటించాడు. సరిగ్గా ఏడాది టార్గెట్ పెట్టుకున్న దర్శకుడు త్వరలోనే ఈ సినిమాకు హైప్ పెంచేపని కూడా మొదలు పెట్టనున్నాడు. ఆదిపురుష్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతిసనన్ నటిస్తుండగా.. విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ మూవీ ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ కి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి.

Adipurush : పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. ఎన్ని భాషలు, థియేటర్లో తెలుసా!

అయితే, ఇదిలా ఉండగానే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ ప్రచారం మొదలైంది. దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీ సీక్వెల్ ని తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ పై ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు ఓంరౌత్ తొలి పార్ట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ పనులు చూసుకుంటూనే.. సెకండ్ పార్ట్ కోసం స్క్రిప్ట్ పై కసరత్తులు చేయడం మొదలు పెట్టాడని.. ఆదిపురుష్ సినిమా రిలీజ్ కాగానే సెకండ్ పార్టీ కూడా పట్టాలెక్కించనున్నట్లు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.