Dhanush-Aishwarya : విడాకుల తర్వాత మొదటిసారి ఎదురుపడ్డ ధనుష్, ఐశ్వర్య.. ఒకే పార్టీలో ఇద్దరూ..

తాజాగా వీరిద్దరూ విడాకుల తర్వాత మొదటిసారి ఒకరికొకరు ఎదురుపడ్డారు. చెన్నైలోని ఓ కామన్‌ ఫ్రెండ్‌ పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ పార్టీలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయితే పార్టీలో.....

Dhanush-Aishwarya : విడాకుల తర్వాత మొదటిసారి ఎదురుపడ్డ ధనుష్, ఐశ్వర్య.. ఒకే పార్టీలో ఇద్దరూ..

Dhanush

Dhanush-Aishwarya :  ఇటీవల చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్వర్య కూడా ఒకరు. కోలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు ఇటీవల విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులు ఎంతో మందికి బాధ కలిగించాయి. వీరి కుటుంబాలతో పాటు అభిమానులు కూడా ధనుష్ – ఐశ్వర్య మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ విడాకుల తర్వాత మొదటిసారి ఒకరికొకరు ఎదురుపడ్డారు.

తాజాగా చెన్నైలోని ఓ కామన్‌ ఫ్రెండ్‌ పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ పార్టీలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయితే పార్టీలో ధనుష్, ఐశ్వర్య మాట్లాడుకుంటారేమోనని పార్టీకి వచ్చిన అతిథులంతా ఆసక్తిగా చూశారు. కానీ వారు మాత్రం మాట్లాడుకోలేదు. కనీసం ఒకరికి ఒకరు తెలిసినట్లుగా కూడా బిహేవ్ చేయలేదని, ఎవరికి వారు తెలియనట్లుగానే ప్రవర్తించారని ఆ పార్టీకి వచ్చిన వ్యక్తుల నుంచి సమాచారం.

Nithin : ‘జూనియర్’గా నితిన్.. మరో సినిమా లైన్లో..

ఇక ఇటీవల షూటింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్‌-ఐశ్వర్యలు రామోజీ ఫిలింసిటీలో ఒకే హోటల్‌లో ఉన్నారన్న సంగతి కూడా తెలిసిందే. అప్పుడు కూడా ఒకే హోటల్ లో ఉన్నా కనీసం ఒకరినిఒకరు చూసుకోలేదు. వీళ్లిద్దరు కలిసి ఒక్కసారైనా మళ్ళీ కనపడకపోతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ మళ్ళీ కలవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.