Jetty Movie : జెట్టి సినిమాలోని ‘దూరం కరిగినా.. మౌనం కరుగునా’.. పాట విడుదల చేసిన క్రేజీ డైరెక్టర్ వేణు ఉడుగుల..
వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణు మాధవ్ నిర్మించి మూవీ ‘జెట్టి’.. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది..
Jetty Movie: వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణు మాధవ్ నిర్మించి మూవీ ‘జెట్టి’.. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది. దక్షిణ భారత దేశంలోనే ఇప్పటి వరకు రాని సరికొత్త సముద్రపు కథ, నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి జీవితాలను తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు..ఈ మూవీ ఆల్బమ్లోని మొదటి సాంగ్ని క్రేజీ డైరెక్టర్ వేణు ఉడుగుల మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొండకండ్ల స్టూడియోలో లాంచ్ చేశారు.. సినిమా కథ తెలసుకొని ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ : ‘‘జెట్టి’ సినిమాలోని ‘దూరం కరిగినా’ పాట లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీమణి గారు రాసిన ఈ పాట సాహిత్యపు విలువలతో ఉంది. కొన్ని షాట్స చూశాను, చాలా బాగున్నాయి.. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. నిర్మాత వేణు మాధవ్ గారికి, మ్యూజక్ డైరెక్టర్ కార్తిక్కి, దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా శుభాకాంక్షలు.. ఇది జీవితాల్లోంచి పుట్టిన కథ.. మత్స్యకారుల జీవితాల్లోని కన్నీటి అలలు.. సమస్యల సుడిగుండాలని విశదీకరించే అద్భుతమైన కథా వస్తువు తీసుకొని ‘జెట్టి’ సినిమాను నిర్మించారు. ఇప్పుడే కథ విన్నాను.. సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను.. అవుతుందని నమ్ముతున్నాను.. నిర్మాతకి రెట్టింపు లాభాలు రావాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొండకండ్ల మాట్లాడుతూ : ‘‘మా స్టూడియోకి వచ్చి సాంగ్ లాంచ్ చేసిన వేణు ఉడుగుల గారికి నా ధన్యవాదాలు. వేణు గారు తీసుకునే కథలు సందేశాత్మకంగా సాగుతాయి. ‘జెట్టి’ సినిమా కథ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాలో శ్రీమణి గారు రాసిన ‘దూరం కరిగినా.. మౌనం కరుగునా’.. పాట సిద్ శ్రీరామ్ గారు పాడారు. ఈ మెలోడీ తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమాలో వచ్చే మొదటి పాట ఇది. పాటల విషయంలో దర్శక నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాలుగు బాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలో అన్ని పాటలు ఆకట్టుకుంటాయి. ‘జెట్టి’ తప్పకుండా మంచి మ్యూజిక్ అల్బమ్ అవుతుంది’’ అన్నారు..
దర్శకుడుసుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ : ‘‘వేణు గారు మా ఆల్బమ్లో మొదటి పాట విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇప్పటి వరకూ ఎవరూ చూపని కథ. సంగీతం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆల్బమ్లో అన్ని సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సిద్ శ్రీరామ్ గారికి ప్రత్యేక దన్యవాదాలు. ‘దూరం కరిగినా .. మౌనం కరుగునా..’ పాటతో ‘జెట్టి’ మ్యూజకల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. సూపర్ హిట్ ఆల్బమ్ అందించబోతున్నాం అనే నమ్మకం మా టీం అందరికీ ఉంది’’ అన్నారు..
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ : కార్తిక్ కొండకండ్ల
డిఓపి : వీరమణి
ఆర్ట్ : ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్ : శ్రీనివాస్ తోట
స్టంట్స్ : దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
డైలాగ్స్ : శశిధర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పండ్రాజు శంకర్రావు
నిర్మాత : వేణు మాధవ్
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : సుబ్రహ్మణ్యం పిచ్చుక
నటీ నటులు: నందిత శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్.యస్. చౌదరి, శివాజీ రాజా, జీవా, సుమన్ శెట్టి తదితరులు..