క‌రోనాతో బీజేపీ కౌన్సిల‌ర్ మృతి

  • Published By: madhu ,Published On : June 15, 2020 / 04:40 AM IST
క‌రోనాతో బీజేపీ కౌన్సిల‌ర్ మృతి

క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. చైనా నుంచి వ‌చ్చిన ఈ రాకాసి వ‌ల్ల ప్రాణాలు పోతున్నాయి. ల‌క్ష‌లాది మంది బ‌లైపోతున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. పొలిటిక‌ల్ నేత‌ల‌కు కూడా వైర‌స్ సోకుతోంది. దీని బారిన ప‌డిన వారు..చ‌నిపోతుండ‌డం వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

తాజాగా…అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు చెందిన బీజేపీ కౌన్సిల‌ర్ బైపురా – హ‌తేశ్క‌ర్ వార్డుకు చెందిన గ‌య‌ప్ర‌సాద్ క‌నోజియా..2020, జూన్ 14వ తేదీ ఆదివారం క‌న్నుమూశారు. జూన్ 01వ తేదీన ఈయ‌న‌కు క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో కుటుంబ‌స‌భ్యులు AMC-run SVP ఆసుప‌త్రిలో చేరిపించారు. 
దీనిపై అహ్మ‌దాబాద్ మేయ‌ర్ బిజ‌ల్ ప‌టేల్ స్పందించారు. క‌నోజియా కుటుంబానికి సంతాపం తెలియ‌చేస్తున్న‌ట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. 

రాష్ట్రంలో కోవిడ్ బారిన ప‌డిన వారి సంఖ్య క్ర‌మేపి పెరుగుతోంది. 29 మంది చ‌నిపోయారు. మొత్తం మృతుల సంఖ్య వేయి 483 మందికి చేరుకుంది. ఆదివారం 511 మందికి వైర‌స్ సోకింద‌ని వైద్యులు నిర్దారించారు. మొత్తం 23 వేల 633 పాజిటివ్ కేసుల‌కు చేరుకుంది. అహ్మ‌దాబాద్ లో అత్య‌ధికంగా 334 కేసులు న‌మోద‌య్యాయి.