Rahul On Indian’s DNA : హిందుత్వవాదులే అలా..RSS చీఫ్ డీఎన్ఏ వ్యాఖ్యలపై రాహుల్
: హిందూ వర్సెస్ హిందుత్వవాది పదం కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల్లోగా ఈ పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
Rahul On Indian’s DNA : హిందూ వర్సెస్ హిందుత్వవాది పదం కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజుల్లోగా ఈ పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇటీవల తన ప్రచార సభల్లో ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశం హిందువుల దేశమే.. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో ఉండాలనుకునే హిందుత్వవాదులది మాత్రం కాదని రాహుల్ తరచూ వ్యాఖ్యానిస్తున్నారు.
హిందువు, హిందుత్వవాది మధ్య చాలా వ్యత్యాసం ఉందని, హిందువు అంటే.. సత్యం కోసం శోధించేవాడనీ, దానినే సత్యాగ్రహం అంటారని , హిందువంటే అందరినీ కలుపుకుని పోయేవాడని, ఎవరికీ భయపడడని, అన్ని మతాలనూ గౌరవించేవాడని….కానీ హిందుత్వవాదులు సత్యాగ్రహం పాటించరని, అధికారం కోసం పాకులాడతారని, అధికారం కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడుతారని రాహుల్ చెబుతున్నారు. మహాత్మాగాంధీ హిందూ అని, గాడ్సే హిందుత్వవాదని కూడా రాహుల్ చెప్పారు. హిందుత్వవాదులు 2014 నుంచి అధికారంలో ఉన్నారని, వారిని సాధ్యమనంత త్వరగా గద్దె దించాలంటూ బీజేపీ టార్గెట్ గా రాహుల్ విమర్శలు గుప్పిస్తారు.
ఈ క్రమంలో శనివారం ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో 40వేల ఏళ్లుగా భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ట్విట్టర్ వేదికగా రాహుల్ ఫైర్ అయ్యారు. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని కేవలం హిందుత్వవాదులే నమ్ముతారని రాహుల్ విమర్శించారు. ప్రతి ఒక్కరి డీఎన్ఏ ప్రత్యేకంగా ఉంటుందని హిందువులు నమ్ముతారని ట్వీట్ లో రాహుల్ పేర్కొన్నారు.
ఇక,ఇటీవల వారణాశిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ గంగాస్నానం చేయడంపై రాహుల్ సెటైర్లు వేశారు. శనివారం అమేథీలో పర్యటించిన రాహుల్..హిందుత్వ వాది ఒక్కరే గంగలో స్నానమాచరించారు. యోగి లేరు, రాజ్నాథ్ కూడా లేరు. హిందువు మాత్రం కోట్ల మందితో కలిసి స్నానమాచరిస్తారు. హిందువు ఒక్కరే పుణ్య స్నానం చేయడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. తాను హిందువునని మోదీ పదే పదే చెబుతారు. కానీ.. ఆయన సత్యాన్ని ఎప్పుడైనా కాపాడారా రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని ప్రకటించారు. ఆ ప్రకటనపై నిలబడ్డారా? అని రాహుల్ గాంధీ సూటిగా నిలదీశారు.
ALSO READ RSS Chief : 40వేల ఏళ్లుగా భారతీయులందరి DNA ఒక్కటే!