కరోనా దేవి..నమో నమహా..
కరోనా దేవి..నమో నమహా..అంటూ..పూజలు చేస్తున్నాడో ఓ వ్యక్తి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారిని అందరూ తిట్టుకుంటే..మాత్రం ఓ వ్యక్తి ఈ వైరస్ ను దేవతగా గుర్తించి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు. వైరస్ బారిన పడిన వారందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో…పూజలు చేస్తున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. చైనా నుంచి వచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్..భారతదేశాన్ని కూడా గడగడాలిస్తోంది.
కేరళ రాష్ట్రంలో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే..రాష్ట్రంలోని కడక్కల్ కు చెందిన అనిలన్ కరోనాకు ప్రతి రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైరస్ ను దేవతగా భావిస్తున్నానని అనిలన్ వెల్లడించారు. వైరస్ ను నిరోధించడానికి పనిచేస్తున్న వారందరూ, వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు శ్రమిస్తున్న వారికి, మీడియా ప్రతినిధులు..ప్రతొక్కరూ బాగుండాలని తాను పూజలు చేస్తున్నానని అంటున్నాడు. తనపై వస్తున్న విమర్శలను మాత్రం పట్టించుకోనని స్పష్టం చేస్తున్నాడు.
వైరస్ మరింత విస్తరిస్తున్న క్రమంలో..ప్రార్థనా మందిరాలు, ఆలయాలు ఓపెన్ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపాడు. కానీ..ఇతను చేస్తున్న విధానాన్ని మాత్రం నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. మండిపడుతున్నారు. కొంతమంది తిడుతున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నాడని అంటున్నారు. కానీ ఇవేమీ మాత్రం అనిలన్ పట్టించుకోవడం లేదు. కరోనా నమో..నమహా..అంటున్నాడు.