Chiranjeevi : రవితేజ సినిమాలు హిట్టు అయినప్పుడు చిరంజీవి గారు పార్టీ ఇస్తారు.. కోన వెంకట్!

మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్‌లో దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ దాదాపు మూవీలో 40 నిమిషాలు పాటు ఉండనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ చిత్రాన్ని కె బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

Chiranjeevi : రవితేజ సినిమాలు హిట్టు అయినప్పుడు చిరంజీవి గారు పార్టీ ఇస్తారు.. కోన వెంకట్!

kona venkat says When Ravi Teja's movies become hits, Chiranjeevi gives a party

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్‌లో దర్శనమిస్తూ చేస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ దాదాపు మూవీలో 40 నిమిషాలు పాటు ఉండనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ చిత్రాన్ని కె బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

Chiranjeevi : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ దిల్ రాజుకి కౌంటర్ ఇచ్చాడా??

“హీరో రవితేజ ఏ సినిమా హిట్టు అయినా చిరంజీవి గారి ఇంటికి డిన్నర్ కి పిలిచేవాడు. ఇండస్ట్రీలో ఎవరిది అయినా సినిమా సక్సెస్ అయితే అది ఆయన సెలబ్రేట్ చేసుకుంటాడు. ముఖ్యంగా రవితేజ ఆయనికి చాలా క్లోజ్ కాబట్టి రవితేజ ప్రతి హిట్టు సినిమాకి ఆయన పార్టీ ఇస్తాడు. దానికి నేనే సాక్ష్యం. నేను, పూరీజగన్నాధ్, రవితేజ ఆలా ఎన్నోసార్లు పార్టీలకు వెళ్ళాము. ఒకరి సక్సెస్ ని తను సెలబ్రేట్ చేసుకోవడం చిరంజీవి గారికి ఉన్న గొప్ప లక్షణం” అంటూ ప్రేక్షకులకు తెలియని విషయాలని బయట పెట్టాడు.

కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. శృతి ఈ మూవీలో కేవలం గ్లామర్ కోసమే కాకుండా ఒక యాక్షన్ సన్నివేశంలో తన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది అంటూ చిరంజీవి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లీక్ చేశాడు. అలాగే కేథ‌రిన్ థ్రెసా, రాజేంద్ర ప్రసాద్ కథలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్, బాబీ సింహా విలన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రాబోతుంది.