Sarkaru Vari Paata : థియేటర్లో మహేష్ ఫాన్స్ రచ్చ.. థియేటర్ అద్దాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్..

తాజాగా మే 2న సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ని ప్రేక్షకుల ఆధ్వర్యంలో లాంచ్ చేద్దామని భావించారు చిత్ర యూనిట్. దీంతో కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. థియేటర్ వద్దకి మహేష్ ఫ్యాన్స్..................

Sarkaru Vari Paata : థియేటర్లో మహేష్ ఫాన్స్ రచ్చ.. థియేటర్ అద్దాలు ధ్వంసం చేసిన ఫ్యాన్స్..

Bhramaramba Theater

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా, పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఇక తాజాగా మే 2న సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ని ప్రేక్షకుల ఆధ్వర్యంలో లాంచ్ చేద్దామని భావించారు చిత్ర యూనిట్.

 

దీంతో కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. థియేటర్ వద్దకి మహేష్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. అభిమానులు ఎక్కువ మంది రావడంతో తోపులాట చోటు చేసుకుంది. అలాగే లోపలికి ముందే రానివ్వకపోవడంతో థియేటర్ ఎంట్రెన్స్ లో జనాలు ఎక్కువగా గుమిగూడారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అద్దాలు పగలగొట్టారు మహేష్ అభిమానులు. ఈ అద్దాలు ధ్వంసం అవ్వడంతో పలువురు అభిమానులకు గాయాలు అయ్యాయి.

Vishwak Sen : ఆ వీడియో ప్రాంక్ కోసమే చేసాను.. పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీ చేయను..

ఇక ట్రైలర్ లాంచింగ్ లో అభిమానులు విజిల్స్, అరుపులతో హంగామా చేశారు. ట్రైలర్లో కూడా అన్ని అంశాలు ఉండి పక్కా కమర్షియల్ సినిమాలా అనిపించడంతో ట్రైలర్ అందరికి విపరీతంగా నచ్చింది. ట్రైలర్ లోని డైలాగ్స్, షాట్స్ అన్ని అభిమానులకే కాదు, ప్రతి ఒక్కరికి బాగా నచ్చేశాయి. ట్రైలర్ అదిరిపోవడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.