Naga Chaitanya : నాగచైతన్య పై క్రష్ ఉందంటున్న మజిలీ బ్యూటీ.. పెళ్లి వార్తలు పై క్లారిటీ!

మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌, నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు గురించి ప్రశ్నించగా, దివ్యాంశ బదులిస్తూ.. నాగచైతన్య అంటే నాకు ఇష్టం. అతని పై నాకు క్రష్ ఉంది. ఐ లవ్ చైతన్య అంటూ సమాధానం ఇచ్చింది.

Naga Chaitanya : నాగచైతన్య పై క్రష్ ఉందంటున్న మజిలీ బ్యూటీ.. పెళ్లి వార్తలు పై క్లారిటీ!

nagachaitanya

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. సమంత నుంచి విడిదిపోయిన ఈ అక్కినేని హీరో.. పలానా హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. గూఢచారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శోభిత ధూళిపాళతో నాగచైతన్య రహస్య ప్రేమాయణం నడిపిస్తున్నాడు అంటూ మొన్నటి వరకు గుసగుసలు వినిపించగా, ఆ వార్తలు పై ఇద్దరు స్పందించి నిజం లేదని కొట్టిపారేశారు. తాజాగా మజిలీ బ్యూటీతో నాగచైతన్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Naga Chaitanya : నాగచైతన్యతో కలిసి వంటలు నేర్చుకుంటున్న వెంకటేష్ కూతురు.. బావ అంటూ ముద్దు ముద్దు మాటలు..

మజిలీ సినిమాలో సమంతతో పాటు ‘దివ్యాంశ కౌశిక్‌’ కూడా నటించింది. అదే సామ్ అండ్ చై కలిసి నటించిన చివరి సినిమా. సమంతతో విడిపోయాక చైతన్య, దివ్యాంశతో ప్రేమలో పడినట్లు, గత కొంతకాలంగా డేటింగ్ కూడా చేస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాదు మజిలీ తరువాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో కూడా దివ్యాంశకి నాగచైతన్యనే అవకాశం ఇప్పించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాలు గురించి దివ్యాంశ స్పందించింది.

ఇటీవల ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలు గురించి ప్రశ్నించగా, దివ్యాంశ బదులిస్తూ.. నాగచైతన్య అంటే నాకు ఇష్టం. అతని పై నాకు క్రష్ ఉంది. ఐ లవ్ చైతన్య. కానీ మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ కొట్టి పారేసింది. అలాగే ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో చైతన్య, తనకి ఛాన్స్ ఇప్పించినట్లు వస్తున్న వార్తలో కూడా నిజం లేదు అంటూ ఖండించింది. కాగా ప్రస్తుతం ఈ భామ సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. రంజిత్ జయకొడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలో అంచనాలు పెంచేసింది.

ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.