Major : నా కుమారుడి బయోపిక్కి 100 శాతం న్యాయం చేయలేరు : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి
ఈ ప్రెస్ మీట్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి మాట్లాడుతూ... తమ కుమారుడిపై బయోపిక్ తీస్తామని ఇప్పటిదాకా చాలా మంది వాగ్దానాలు చేశారు. కానీ ఎవరూ తీయలేదు. అడవి శేష్ కూడా......
Major : 26/11 ఉగ్రదాడుల సమయంలో ముంబైని రక్షించడంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిలో దివంగత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే బయోపిక్ తీస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ హీరో అడవి శేష్ బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26, 2008 ముంబైలో ఉగ్రదాడి జరిగి నిన్నటికి 13 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ‘మేజర్’ సినిమా టీం ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించి సందీప్ తల్లిదండ్రులైన ఇస్రో రిటైర్డ్ అధికారి కె.ఉన్నికృష్ణన్, ధనలక్ష్మీ ఉన్నికృష్ణన్ లతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
AP Online Ticketing : ఇలా అయితే కష్టం.. ఏపీ సినిమా టికెట్ల అంశంపై స్పందించిన నిర్మాత సురేష్బాబు
ఈ ప్రెస్ మీట్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి మాట్లాడుతూ… తమ కుమారుడిపై బయోపిక్ తీస్తామని ఇప్పటిదాకా చాలా మంది వాగ్దానాలు చేశారు. కానీ ఎవరూ తీయలేదు. మొదట్లో అడవి శేష్ కూడా మా వద్దకు వచ్చి బయోపిక్ తీస్తామంటే మేము ఒప్పుకోలేదు. ‘మేజర్’ చిత్రంలో తమ కుమారుడి పాత్రను అడవి శేష్ పోషిస్తామనడంతో ఒప్పుకున్నాం అని అన్నారు.
Bigg Boss Vishwa : బిగ్బాస్ నుంచి బయటకి వచ్చాడు.. బిఎండబ్ల్యు కార్ కొన్నాడు
సినిమాపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. సినిమా చూసాకే నా అభిప్రాయం చెప్తాను. అడవి శేష్ కంటే కూడా డైరెక్టర్ శశికిరణ్ మీదే నాకు నమ్మకం ఎక్కువగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది అని చెప్పారు. విడుదల తేది కూడా ప్రకటించారు. నేను సందీప్ తండ్రిని. సందీప్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. అతని మొదటి విమర్శకుడిని నేనే. సందీప్ను అతనిలా 100 శాతం చిత్రీకరించలేరని నేను అనుకుంటున్నాను. అసలు ఏ బయోపిక్ అయినా 100 శాతం పూర్తిగా చూపించలేరు. నేను వారి ప్రయత్నాన్ని విమర్శించడం లేదు. శేష్ చాలా నిజాయితీపరుడు. కానీ సందీప్ను ప్రతిబింబించేలా నటించగలడో లేదో తెలియదు. సినిమా చూసాకే దాని గురించి మాట్లాడతాను అని సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ తెలిపారు.