Mid Day Meal : మధ్యాహ్న భోజనంలో మార్పులు.. ప్రతిరోజు పప్పన్నం, మెనూలో కొత్తగా కిచిడీ

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12 నుంచి మెనూ అమలు కానుంది.

Mid Day Meal : మధ్యాహ్న భోజనంలో మార్పులు.. ప్రతిరోజు పప్పన్నం, మెనూలో కొత్తగా కిచిడీ

Mid Day Meal

Mid Day Meal Menu Changes : స్కూల్స్ లో పంపిణీ చేస్తున్న మధ్యాహ్నం భోజనంలో మార్పులు చేశారు. కొత్త విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్నం భోజనంలో మెనూ మారనుంది. మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు ఇక నుంచి ప్రతి రోజు పప్పు అందించనున్నారు. మెనూలో కొత్తగా కిచిడీని జత చేశారు.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12 నుంచి మెనూ అమలు కానుంది. గతంలో మధ్యాహ్న పథకంలో రోజు విడిచి రోజు పప్పును అందించేవారు. పోషకాహారంలో భాగంగా ఇకనుంచి ప్రతిరోజు పప్పును భోజనంలో వడ్డిస్తారు. సోమవారం కిచిడీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు ఇవ్వనున్నారు.

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

మంగళవారం అన్నం, సాంబార్, మిక్స్ డ్ వెజిటుబల్ కర్రీ, బుధవారం అన్నం, ఆకు కూర పప్పు, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, కోడిగుడ్డు.. గురువారం వెటిటబుల్ బిర్యానీ, మిక్స్ డ్ వెటిటబుల్ కర్రీ, శుక్రవారం రైస్, ఆకు కూర పప్పు, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, కోడి గుడ్డు వడ్డించనున్నారు.

శనివారం రైస్, ఆకు కూర పప్పు, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీతో కొత్త మెనూను రెడీ చేశారు. ప్రతిరోజూ విద్యార్థులకు ఏదో ఒకరూపంలో పప్పు ఉండేలా మెనూ సిద్ధం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 28,606 స్కూల్స్ లోని 25 లక్షల 26 వేల 907 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.