Mithali Raj: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022

బీసీసీఐ జనవరి 6 శుక్రవారం భారత మహిళా క్రికెట్ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022కోసం సెలక్టర్లు మిథాలీని కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక..

Mithali Raj: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022

Mithali Raj

Mithali Raj: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) జనవరి 6 శుక్రవారం భారత మహిళా క్రికెట్ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022కోసం సెలక్టర్లు మిథాలీని కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఈ ఈవెంట్ కు జెమీమా రోడ్రిగేజ్, శిఖా పాండేలను పక్కకుపెట్టేశారు. న్యూజిలాండ్ వేదికగా మార్చి 4 నుంచి ఏప్రిల్ 3వరకూ ఈ టోర్నీ నిర్వహించనున్నారు.

2021లో రోడ్రిగేజ్ అంతర్జాతీయ క్రికెట్ లో ఆకట్టుకునేంత ప్రదర్శన కనబరచకపోవడంతో సెలక్టర్లు ఆసక్తి చూపలేకపోయారు. శిఖా పాండే ఫామ్ లేమి ఆమెకు అవకాశం దక్కకుండా చేసింది.

భారత మహిళా జట్టు:
Mithali Raj (కెప్టెన్), Harmanpreet Kaur (వైస్ కెప్టెన్), Smriti Mandhana, Shafali Verma, Yastika, Deepti, Richa Ghosh (వికెట్ కీపర్), Sneh Rana, Jhulan Goswami, Pooja, Meghna Singh, Renuka Thakur, Taniya Bhatia (వికెట్ కీపర్), Rajeshwari, Poonam Yadav.