Nikhil : వేలాదిమందికి దిశా నిర్దేశం చేశావు.. మిస్ యు నాన్న.. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్

ట్వీట్ లో నిఖిల్.. ''నా తండ్రి శ్యామ్‌ సిద్దార్థ్‌ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నాన్న. ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు.........

Nikhil : వేలాదిమందికి దిశా నిర్దేశం చేశావు.. మిస్ యు నాన్న.. హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్

Nikhil

 

Nikhil :  ఏప్రిల్ 28 గురువారం తెల్లవారుజామున హీరో నిఖిల్ సిద్దార్థ్ తండ్రి శ్యామ్ సిద్దార్థ్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తాజాగా నిఖిల్ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్ చేశాడు. తన తండ్రితో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

 

ఈ ట్వీట్ లో నిఖిల్.. ”నా తండ్రి శ్యామ్‌ సిద్దార్థ్‌ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను నాన్న. ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ గారికి ఆయన వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని చాలా కలలు కన్నారు ఆయన. ఆయన సహాయసహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్‌ టాపర్‌. ఎప్పుడూ ఆయన కష్టాన్ని నమ్మేవారు.”

South Heroins: కాస్త గ్యాప్ ఇచ్చి బీటౌన్‌లో వాలిపోతున్న సౌత్ భామలు

”జీవితాన్ని ఎంజాయ్‌ చేద్దామనుకునే సమయంలో అరుదైన వ్యాధిబారిన పడ్డాడు. కార్టికోబాసల్‌ డీజనరేషన్‌ అనే వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడారు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ. లవ్‌ యూ, మిస్ యు నాన్న. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, ముంబైలో సమ్మర్‌ను ఎంజాయ్‌ చేయడం.. ఇవన్నీ నేను మిస్‌ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను.. నీ నిక్కీ” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. నిఖిల్ తండ్రికి పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు.