Pawan Kalyan : ఆ ఇద్దరు హీరోలకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..

ఇటీవల కబ్జా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారట. కానీ జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండటం, పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. దీంతో తానూ రాలేకపోయినందుకు బాధపడుతున్నాను అంటూ......................

Pawan Kalyan : ఆ ఇద్దరు హీరోలకు సారీ చెప్పిన పవన్ కళ్యాణ్..

Pawan kalyan released a press note as he regret for not coming to Upendra Kabjaa movie audio launch

Pawan Kalyan :  కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కలిసి నటిస్తున్న సినిమా కబ్జా. శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా భారీ లెవల్లో ఈ సినిమాని చిత్రీకరించారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని మార్చ్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

అయితే ఇటీవల కబ్జా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారట. కానీ జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండటం, పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. దీంతో తానూ రాలేకపోయినందుకు బాధపడుతున్నాను అంటూ పవన్ అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Arya Dhayal : మలయాళం యంగ్ సింగింగ్ సెన్సేషన్.. రౌడీ హీరో తమ్ముడి కోసం తెలుగులో..

ఈ ప్రెస్ నోట్ లో కబ్జా సినిమా ఆడియో లాంచ్ కి నన్ను అతిథిగా ఆహ్వానించారు. కానీ ముందే ఫిక్స్ అయి ఆన్న జనసేన పార్టీ కార్యక్రమాల వల్ల నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. హీరోలుగా నటించిన ఉపేంద్ర గారికి, సుదీప్ గారికి బెస్ట్ విషెష్ తెలియచేస్తున్నాను. వారిద్దరూ వేరే భాషల్లో కూడా వారి నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర దర్శకుడు చంద్రు, నిర్మాత రామచంద్ర గౌడ, మిగిలిన చిత్ర యూనిట్ కు నా అభినందనలు అని పోస్ట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ వైరల్ గా మారింది.