Pooja Hegde : ప్రభాస్కు నాకు ఎలాంటి గొడవ జరగలేదు.. అవన్నీ వట్టి పుకార్లే..
ఇటీవల ప్రభాస్ కి, పూజాహెగ్డేకి గొడవలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో వీరిద్దరూ అస్సలు మాట్లాడుకోలేదు. కనీసం.....
Pooja Hegde : ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇప్పటికే అనేక వాయిదాలు పడి ఈ మార్చ్ 11న రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది. ప్రస్తుతం మరోసారి ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశం మొత్తం సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇటీవల ప్రభాస్ కి, పూజాహెగ్డేకి గొడవలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ముంబైలో జరిగిన రాధేశ్యామ్ ప్రమోషన్ ఈవెంట్లో వీరిద్దరూ అస్సలు మాట్లాడుకోలేదు. కనీసం ఒకర్నొకరు చూసుకోలేదు కూడా. ఆ తర్వాత మరికొన్ని ప్రమోషన్స్ ఈవెంట్స్ లోను వీరిద్దరూ మాట్లాడుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు, అందుకే వీరు మాట్లాడుకోవట్లేదని వార్తలు ప్రసారం అయ్యాయి. అంతే కాక ప్రమోషన్స్ కార్యక్రమంలో వీరిద్దరూ ఎడమెహం, పెడమెహంగా ఉండటం, ప్రమోషన్స్ల్లో ప్రభాస్- పూజలు కలిసి పోజులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడటం లాంటివి ఈ వార్తలకి మరింత బలాన్ని చేకూర్చాయి.
OTT Release: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో క్రేజీ కంటెంట్!
అయితే తాజాగా ఈ వార్తలపై పూజాహెగ్డే స్పందించింది. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా పూజా హెగ్డే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”ప్రభాస్ గొప్ప మనసున్న వ్యక్తి. షూటింగ్ టైంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రతి రోజు ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం కూడా తెప్పించేవారు. అంత మంచి మనిషితో నాకు మాటలు లేకపోవడమేమిటి? అదంతా వట్టి పుకార్లే. నేనే కాదు ఎవరైనా సరే ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు’ అని ప్రభాస్ గురించి తెలుపుతూ వచ్చే వార్తలని పుకార్లని కొట్టిపారేసింది.