Radheshyam : సంక్రాంతికి సినిమా లేదు.. గాలి పటాలు మాత్రమే..

ప్రభాస్ ఫ్యాన్స్ ని శాంత పరచడానికి రాధేశ్యామ్ కొత్త ప్రమోషన్ చేసింది. సంక్రాంతికి అందరూ గాలి పటాలు ఎగురవేస్తారు కాబట్టి సినిమా టీం 'రాధేశ్యామ్' గాలి పటాలని మార్కెట్ లోకి...........

Radheshyam :  సంక్రాంతికి సినిమా లేదు.. గాలి పటాలు మాత్రమే..

Radjershyam (1)

Radheshyam :  ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రావడం ఖాయం అనుకున్నారు. కానీ కరోనా దృష్ట్యా వేరే రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడటంతో ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా సినిమా కావడంతో వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరాశ పడ్డారు.

Mahesh Babu : మహేష్ మేనల్లుడు ‘హీరో’ మహేష్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ని శాంత పరచడానికి రాధేశ్యామ్ కొత్త ప్రమోషన్ చేసింది. సంక్రాంతికి అందరూ గాలి పటాలు ఎగురవేస్తారు కాబట్టి సినిమా టీం ‘రాధేశ్యామ్’ గాలి పటాలని మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ గాలిపటాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్, పూజాహెగ్డే ఫొటోలతో పాటు రాధేశ్యామ్ సినిమా పోస్టర్స్ తో ఈ గాలి పటాలని విడుదల చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులంతా ఈ గాలి పటాలని ఎగబడి మరి కొంటున్నారంట. సోషల్ మీడియాలో ఈ గాలి పటాలతో ఫోటోలు దిగి ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ‘రాధేశ్యామ్’ సినిమాకి ఈ రకంగా కూడా ప్రమోషన్ అవుతుంది.