Rohit Sharma: ధోనీ, కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా రోహిత్‌దే ఆ ఘనత

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో రోహిత్ శర్మ ప్రత్యేక ఘనత సాధించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత 1000 పరుగులు సాధించిన కెప్టెన్ గా మూడో స్థానంలో నిలిచాడు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి T20లో ఈ మైలురాయిని అందుకున్నాడు.

Rohit Sharma: ధోనీ, కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా రోహిత్‌దే ఆ ఘనత

Rohit Sharma (1)

 

 

Rohit Sharma: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో రోహిత్ శర్మ ప్రత్యేక ఘనత సాధించాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత 1000 పరుగులు సాధించిన కెప్టెన్ గా మూడో స్థానంలో నిలిచాడు. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి T20లో ఈ మైలురాయిని అందుకున్నాడు.

రోహిత్ మ్యాచ్ ప్రారంభమైనప్పుడు 13 పరుగుల దూరంలో ఉండగా.. ఈ ఫీట్‌ చాలా తక్కువ సమయంలో సాధించి.. 1000 పరుగులు చేసిన అంతర్జాతీయ T20I జట్టు కెప్టెన్‌గానే కాకుండా.. 10వ బ్యాటర్‌గా కూడా రోహిత్ నిలిచాడు.

ఆరోన్ ఫించ్ ప్రస్తుతం 65 మ్యాచ్‌లలో 33.40 సగటుతో 1971 పరుగులు, ఒక సెంచరీ, 12 అర్ధ సెంచరీలతో 140.58 స్ట్రైక్ రేట్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.

Read Also : కోహ్లీ రికార్డుకు 4పరుగుల దూరంలో రోహిత్ శర్మ
మొదటి టీ20లో, భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత రోహిత్ ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. 14 బంతుల్లో 24 పరుగులతో ఐదు ఫోర్లు కొట్టాడు.

మూడో ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్ వేస్తుండగా బంతి స్కిడ్ అవడంతో, రోహిత్ బంతిని నేరుగా జోస్ బట్లర్‌ వైపుకు బాదాడు. అతను గ్లోవ్స్‌తో చక్కగా క్యాచ్ అందుకున్నాడు. భారత T20 జట్టు కెప్టెన్‌గా 29 మ్యాచ్‌లలో, శర్మ తన పేరు మీద 2 సెంచరీలతో 37.44 సగటుతో 1011 పరుగులు చేశాడు.

కెప్టెన్‌గా శర్మ న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేశాడు. ఏడు మ్యాచ్‌లలో 51.33 సగటుతో 208 పరుగులను అజేయంగా 60 పరుగులతో సాధించాడు.