Virata Parvam : ఇది కదా క్రేజ్ అంటే.. వర్షంలో కూడా సాయిపల్లవి కోసం అభిమానులు.. అభిమానుల కోసం సాయి పల్లవి..

సాయిపల్లవి క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమెకు ఉన్న అభిమానులు, సాయి పల్లవి కనపడితే చాలు అనే ఫ్యాన్స్, ఆమెను చూడగానే విజిల్స్, అరుపులు వేసే ప్రేక్షకులు..........

Virata Parvam : ఇది కదా క్రేజ్ అంటే.. వర్షంలో కూడా సాయిపల్లవి కోసం అభిమానులు.. అభిమానుల కోసం సాయి పల్లవి..

Sai Pallavi

Sai Pallavi :  రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తాజాగా ఆదివారం సాయంత్రం విరాటపర్వం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండగా సాయిపల్లవి నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చు అని తెలుస్తుంది. అయితే విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని శనివారం సాయంత్రం కర్నూల్ లో నిర్వహించారు.

సాయిపల్లవి క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆమెకు ఉన్న అభిమానులు, సాయి పల్లవి కనపడితే చాలు అనే ఫ్యాన్స్, ఆమెను చూడగానే విజిల్స్, అరుపులు వేసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. తన న్యాచురల్ యాక్టింగ్ తో, తన అద్భుతమైన డ్యాన్సులతో, బయట తన మంచితనంతో చాలా మంది హీరోయిన్స్ లలో సపరేట్ గా నిలిచి ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది. ఎంతోమంది ప్రేక్షకులు ఆమెకి ఫిదా అయిపోయారు. గతంలో పలు మార్లు సాయి పల్లవి క్రేజ్ పలు ఈవెంట్లలో ప్రూవ్ అయింది. ఏకంగా సాయి పల్లవి క్రేజ్ చూసి సుకుమార్ ఆమెని లేడీ పవన్ కళ్యాణ్ అని పిలిచారంటే ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అర్ధమవుతుంది.

తాజాగా మరోసారి సాయి పల్లవి క్రేజ్ కర్నూలులో కనపడింది. అయితే ఈ సారి అభిమానులు ఆమెపై అభిమానం చూపించడమే కాదు సాయి పల్లవి కూడా వారిపై ఉన్న ప్రేమని చూపించింది. శనివారం కర్నూలులో నిర్వహించిన విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వర్షం, ఈదురు గాలుల కారణంగా అర్దాంతరంగా ముగిసింది. మొదట వాతావరం బాగానే ఉన్నా తర్వాత వర్షం, ఈదురు గాలులు మొదలయ్యాయి. అయితే అవి తగ్గాక మళ్ళీ ఈవెంట్ మొదలు పెడదాం అనుకున్నారు. కానీ అది తగ్గేలా లేదని ఈవెంట్ ని అర్దాంతరంగా ఆపేశారు.

Tollywood : ఆడియన్స్ థియేటర్స్ కి ఎందుకు రావట్లేదు??

అయితే సాయి పల్లవిని చూడటానికి ఈ ఈవెంట్ కి కర్నూల్ చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. దీంతో అభిమానులని నిరాశపరచొద్దని సాయి పల్లవి ఆ వర్షంలోనే స్టేజిపైకి ఎక్కి మాట్లాడింది. అభిమానులు కూడా సాయి పల్లవి కోసం అలాగే వర్షంలో ఉన్నారు. సాయి పల్లవి మాట్లాడుతుంటే రానా, నవీన్ చంద్ర ఆమెకు గొడుగు పట్టుకున్నారు. అయితే అక్కడ సాయిపల్లవి మాట్లాడిన మాటలు వినపడినా వర్షం వల్ల ఏర్పడ్డ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సాయిపల్లవి మాట్లాడింది రికార్డ్ అవ్వలేదు, టెలికాస్ట్ అవ్వలేదు. అయినా అక్కడికి వచ్చిన అభిమానులు సాయి పల్లవిని చూశాము అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వర్షంలోనే సాయి పల్లవి కోసం అభిమానులు ఉండటం, అదే వర్షంలో అభిమానుల కోసం సాయి పల్లవి మాట్లాడటం చూసి ఆమెని అభినందిస్తూ మరోసారి ఆమె క్రేజ్ ఇది కదా అని అంటున్నారు. వేరే ఆర్టిస్టులంతా మరోసారి సాయి పల్లవి క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు. విరాటపర్వం సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.