Sarkaru Vaari Paata: దొంగలెత్తుకెళ్లిన కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్.. ఏం జరిగిందంటే?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా గురించే వినిపిస్తుంది. మొన్నటి వరకు జస్ట్ సినిమా వస్తుందని అనుకున్న ప్రేక్షకులు తాజాగా ట్రైలర్ రిలీజ్ తో మరోసారి మహేష్ బాబు పోకిరి రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడా అనే చర్చలు మొదలు పెట్టారు.

Sarkaru Vaari Paata: దొంగలెత్తుకెళ్లిన కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్.. ఏం జరిగిందంటే?

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా గురించే వినిపిస్తుంది. మొన్నటి వరకు జస్ట్ సినిమా వస్తుందని అనుకున్న ప్రేక్షకులు తాజాగా ట్రైలర్ రిలీజ్ తో మరోసారి మహేష్ బాబు పోకిరి రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతాడా అనే చర్చలు మొదలు పెట్టారు. ఎస్వీపీ ట్రైలర్ అంతగా ఆకట్టుకుంది. రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో దుమ్మురేపుతూ టాప్ ట్రెండ్ లో కొనసాగుతుంది. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలు పెట్టింది.

Sarkaru Vaari Paata: ట్రైలర్‌తో అంటుకున్న మాస్ ఫైర్.. ఆకాశానికి అంచనాలు!

ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలిస్తున్న మూవీ యూనిట్ ఈ సినిమా గురించి, షూటింగ్ కు సంబంధించిన అంశాలు. సినిమాపై వాళ్లకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా వినిపిస్తున్నాయి. దర్శకుడు పరుశురాం, హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స‌ర్కారు వారి పాట‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. షూటింగ్ టైంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోని విష‌యం గురించి మాట్లాడిన ఈ ఇద్దరూ.. స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఓ దొంగతనం గురించి చెప్పుకొచ్చారు.

Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

బార్సిలోనాలో అక్క‌డ దొంగ‌లు ఎక్కువ‌. అప్ప‌టి షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఒక వ్యానులో పెట్టి.. ట్ర‌య‌ల్స్ వేసుకుందామ‌ని కొంత గ్యాప్ ఇచ్చి వ‌చ్చే సరికి.. వ్యానులో ఉన్న కీర్తిసురేశ్ కాస్టూమ్స్ ఎత్తుకెళ్లారట. నాలుగు సూట్‌కేసుల్లో మూడు దొంగలు ఎత్తుకెళ్లారట. ల‌క్కీగా అంత‌కుముందే మ‌రో రెండు రోజుల‌కు స‌రిప‌డా కాస్టూమ్స్ అందుబాటులో ఉండ‌టంతో వాటితో ఆ రెండు రోజులు షూటింగ్‌కు ఇబ్బంది లేకపోగా.. ఆ రెండు రోజులలో మ‌ళ్లీ మిగతా కాస్టూమ్స్ ఏర్పాటు చేసుకున్నామ‌ని చెప్పుకొచ్చారు ప‌ర‌శురాం అండ్ కీర్తిసురేశ్‌.