Allu Arjun : అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. అమెరికాలో..

తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం లభించనుంది. ప్రతి సంవత్సరం న్యూయార్క్ లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'గ్రాండ్‌ మార్షల్‌ ఇండియా డే పరేడ్‌' నిర్వహిస్తారు. ఈ సారి ఈ పరేడ్ కి అల్లు అర్జున్ నాయకత్వం.....................

Allu Arjun : అల్లు అర్జున్‌కి అరుదైన గౌరవం.. అమెరికాలో..

Allu Arjun

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా మాసివ్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఇప్పటికే ఈ సినిమాతో పలు రికార్డులు సాధించిన అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం లభించనుంది. ప్రతి సంవత్సరం న్యూయార్క్ లో ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ‘గ్రాండ్‌ మార్షల్‌ ఇండియా డే పరేడ్‌’ నిర్వహిస్తారు.

అయితే ఈ సారి ఈ పరేడ్ కి అల్లు అర్జున్ నాయకత్వం వహించబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 21న న్యూయార్క్‌లో జరగనున్న ‘గ్రాండ్‌ మార్షల్‌ ఇండియా డే పరేడ్‌’కి అల్లు అర్జున్ కి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’ ప్రకటించింది. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో ఈ సంవత్సరం ఆగస్టు 21న జరిగే 40వ భారత దినోత్సవ పరేడ్‌కు అల్లు అర్జున్‌ నాయకత్వం వహిస్తారని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోషియేషన్‌’ ప్రకటించింది. అలాగే ఈ వేడుకలో భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలను కూడా నిర్వహించనున్నారు.

Krishna Vamsi : అసలు పెళ్లే వద్దనుకున్నా.. కానీ.. విడాకుల రూమర్స్ పై స్పందించిన కృష్ణవంశీ

ఇంతటి గొప్ప కార్యక్రమానికి భారతదేశం తరపున అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత్, అమెరికాకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంతో అల్లు అర్జున్ పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవ్వనుంది.