Bhola Shankar: ‘భోళాశంకర్’లో హైలైట్ కానున్న స్పెషల్ ట్రాక్.. ఏమిటంటే?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ మూవీలో ఓ స్పెషల్ ట్రాక్ ఉండనుంది. ఈ ట్రాక్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రానుంది. ఈ చిత్రంలో చిరంజీవి ఓ సరికొత్త లుక్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కు తెలుగు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు.
Bhola Shankar : యాక్షన్ షెడ్యూల్ మొదలుపెట్టిన భోళాశంకర్..
ఇక ఈ సినిమాకు సంబంధించి చిత్ర వర్గాల్లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ ట్రాక్ హైలైట్గా నిలవనుందట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ల మధ్య ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అయితే, ఎమోషన్ ఎక్కువగా ఉందనే భావన ప్రేక్షకుల్లో కలగకుండా ఉండేందుకు.. ఈ సినిమాలో స్పెషల్ కామెడీ ట్రాక్ను క్రియేట్ చేస్తున్నారు. మెగాస్టార్, వెన్నెల కిషోర్, సత్య, హైపర్ ఆదిల మధ్య ఈ స్పెషల్ కామెడీ ట్రాక్ ఉంటుందని.. ఈ సినిమాకే ఇది హైలైట్ కానుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Bhola Shankar : భోళా శంకర్ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్.. మెహర్ రమేష్ ని ఆడేసుకుంటున్న మీమర్స్..
దీంతో ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ఎలా ఉండబోతుందా.. మెగాస్టార్ తనదైన కామెడీతో ప్రేక్షకులను మరోసారి ఎలా ఆకట్టుకుంటాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ తమన్నా హీరోయిన్గా నటిస్తోండగా, ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.