SSMB28: మహేష్-త్రివిక్రమ్‌లు పాన్ ఇండియాపై సక్సెస్‌పై కన్నేశారు.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడని చిత్ర వర్గాలు ఇప్పటికే తెలిపాయి.

SSMB28: మహేష్-త్రివిక్రమ్‌లు పాన్ ఇండియాపై సక్సెస్‌పై కన్నేశారు.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్!

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడని చిత్ర వర్గాలు ఇప్పటికే తెలిపాయి.

SSMB28: మహేష్ సినిమా నుండి తప్పుకున్న హీరోయిన్.. కారణం అదేనా..?

అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేసి, దానిలో కొన్ని మార్పులు చేసి చిత్రీకరిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్‌ను ఈ నెలలోనే స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఓ అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడని.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా అధికారికంగా అనౌన్స్ చేసింది.

SSMB28: మహేష్ బాబు సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

అంతేగాక, ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. దీంతో మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఎలాంటి పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.