ఆ 4 జిల్లాల్లో వైసీపీ ఓటమి ఖాయం, చంద్రబాబు జోస్యం

మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ వేళ టీడీపీ చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరులపై అధికార వైసీపీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యానికి ఈసీ అడ్డుకుట్ట వేయాలన్నారు.

ఆ 4 జిల్లాల్లో వైసీపీ ఓటమి ఖాయం, చంద్రబాబు జోస్యం

ysrcp will defeat in those 4 districts: మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ వేళ టీడీపీ చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరులపై అధికార వైసీపీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ దౌర్జన్యానికి ఈసీ అడ్డుకుట్ట వేయాలన్నారు.

గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి కార్పొరేషన్లలో అధికార పార్టీ ఓటమి ఖాయం అని చంద్రబాబు జోస్యం చెప్పారు. పోలింగ్ శాతం పెరగకూడదన్న ఉద్దేశ్యంతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు స్వచ్చందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు కోరారు.