బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి

‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 09:26 AM IST
బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి

‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’

‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’

ఈ శ్లోకాన్ని చదువుతూ ఉగాది పచ్చడి తినాలని చెబుతోంది శాస్త్రం. మధుమాసంలో వచ్చే శోక బాధలను మన దగ్గరకు రాకుండా చేయటానికి.. బాధలు లేకుండా చూడాలని దేవుడిని కోరటమే ఆ శ్లోకం అర్థం. ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినేది ఈ ఉగాది పచ్చడి. 

కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండుతో పచ్చడి తయారు చేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి.Read Also : ఉగాది పచ్చడిలో వేపపువ్వు ప్రాధాన్యత