ఆది ‘బుర్రకథ’ పోస్టర్ రిలీజ్
యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో జోడి అనే చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో కథానాయికగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. లేటెస్ట్ గా ఆది మరో సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో ఆది డ్యూయల్ షేడ్ లో కనిపించబోతున్నాడు.
రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్తో పాటు రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్, గాయత్రీ గుప్తా తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. శివ శక్తి దత్త ఈ సినిమాలో ఒక పాట రాశారు. అలాగే రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల, శ్రీమణి, శ్రేష్ఠ ఇతర పాటలు రచించారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘నాకు ఈ యేడాదిలో ఇది మూడో సినిమా. మూడు కథలు కూడా నాకు చాలా తృప్తినిచ్చాయి. ఈ సినిమా చేస్తుండడంపై థ్రిల్గా ఉంది. రత్నబాబు మంచి కథ చెప్పారు. నా పాత్ర భిన్నంగా ఉంటుంది. ఉన్నతమైన సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు.