Adivi Sesh : మేజర్ సినిమాలో ఆ సన్నివేశాలని ఎడిటింగ్ లో తీసేశాం.. నిర్మాతకి క్షమాపణలు చెప్పిన అడివిశేష్..

శాకిని డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడివిశేష్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా నిర్మాత సునీతగారికి సారీ చెప్పడం కోసమే నేను ఈవెంట్‌కి వచ్చాను. మేజర్‌ సినిమాలో................

Adivi Sesh : మేజర్ సినిమాలో ఆ సన్నివేశాలని ఎడిటింగ్ లో తీసేశాం.. నిర్మాతకి క్షమాపణలు చెప్పిన అడివిశేష్..

Adivi Sesh apologizes to Sunita Tati

Adivi Sesh :  నివేదా థామస్, రెజీనా కసాండ్రా ముఖ్య పాత్రల్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా శాకిని డాకిని. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని గురు ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత సునీత తాటి నిర్మించగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శాకిని డాకిని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి హీరో అడివిశేష్, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా వచ్చారు.

Vijay Devarakonda : దాని గురించి ఇక్కడెందుకు.. వేడుకల్ని ఎంజాయ్ చేయండి..

శాకిని డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అడివిశేష్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా నిర్మాత సునీతగారికి సారీ చెప్పడం కోసమే నేను ఈవెంట్‌కి వచ్చాను. మేజర్‌ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్ర కోసం ఒక ఆర్టిస్ట్ ని తీసుకున్నాం. అయితే ఆమెకి కోవిడ్ రావడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో మాకు సునీత గారే గుర్తుకు వచ్చి ఆమెని సంప్రదించాం. సునీత గారు మేజర్ సినిమాలో నటించారు. కానీ సినిమా నిడివి ఎక్కువవడంతో ఆమె ఉన్న సన్నివేశాలు తొలగించాల్సి వచ్చింది. అప్పుడు కలిసి సారీ చెబితే కొడతారేమోనన్న భయంతో ఇక్కడ ఈవెంట్లో చెప్తున్నా” అని తెలిపారు.