టాలీవుడ్ పై ప్రియా ‘కన్ను’

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 08:30 AM IST
టాలీవుడ్ పై ప్రియా ‘కన్ను’

మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘ఒరు ఆడార్ ల‌వ్‌’లో కేవ‌లం 27 సెక‌న్ల పాటు ఆమె చేసిన క‌నుసైగ‌కు రెండు రోజుల్లోనే 45 ల‌క్షల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్పటికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు. ప్రియా వారియర్ గురించి ఇప్పుడు తెలియని వారు ఉండరేమో. కేవలం రెండే రెండు నిమిషాల వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. అలాంటి ప్రియా ప్రకాష్ వారియర్‌ కోసం బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు కూడా క్యూ కడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తున్న ప్రియా వారియర్ తెలుగు ప్రేక్షకులకు చేరువ కాబోతున్నది. వివరాల్లోకి వెళితే.
ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మళయాళ సినిమా ‘ఒరు ఆడార్ ల‌వ్‌ ‘ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. మలయాళ దర్శకుడు ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. మలయాళ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నాడు.