Babu Mohan : ఈవీవీ లేకుంటే నేను కోలుకునే వాడిని కాదు.. నా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు..!

హాస్య నటులు బాబు మోహన్ కామెడీని ఎవరూ మర్చిపోరు. సినిమాలకు దూరంగా ఉన్న ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Babu Mohan : ఈవీవీ లేకుంటే నేను కోలుకునే వాడిని కాదు.. నా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు..!

Babu Mohan

Updated On : October 10, 2023 / 4:40 PM IST

Babu Mohan : టాలీవుడ్ కమెడియన్స్‌లో బాబు మోహన్‌ది ప్రత్యేక స్ధానం.  ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన నటించిన సినిమాల్లో కామెడీ సీన్స్ చూస్తే కడుపుబ్బా నవ్వేస్తాం. నటుడిగానే కాకుండా పొలిటీషియన్‌గా కూడా రాణించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Uday Kiran : అతడు సినిమా ఉదయ్ కిరణ్ చేయాల్సింది.. కానీ మహేష్ బాబు..

బాబుమోహన్ అనగానే సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుగారితో నటించిన కామెడీ సీన్స్ కళ్లముందు కనిపిస్తాయి. సినిమాలంటే ఉన్న క్రేజ్‌తో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసారాయన. ‘మామగారు’ సినిమాలో వేసిన బిచ్చగాడు పాత్ర ఆయన కెరియన్‌ని ఓ మలుపు తిప్పింది. రాజేంద్రుడు-గజేంద్రుడు, జంబలకిడి పంబ, పెదరాయుడు వంటి సినిమాల్లో కమెడియన్‌గా అలరించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే 1999 టీడీపీలో ఆందోల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేసారు. 2009 లో కొడుకు మరణం ఆయనను కుంగదీసింది అని చెప్పాలి. బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన బాబుమోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వరుస పెట్టి సినిమాలు చేసిన రోజుల్లో తను సినిమాకి ఇంత డబ్బు ఇవ్వండి అని నిర్మాతల్ని డిమాండ్ చేయలేదట. అడ్వాన్స్‌లు ఇచ్చి వెళ్లిపోయేవారట. మళ్లీ డబ్బింగ్ టైంలో బాబు మోహన్ డబ్బులు అడిగేవారట. కొందరు చెక్ రెడీ చేస్తున్నాం సార్ అని చెప్పేవారట. మళ్లీ కనిపించేవారు కాదట. చాలామంది ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయట. ఇటీవల ఇల్లు మారినప్పుడు కుప్పలు కుప్పలుగా పడి ఉన్న చెక్కులు బయట పారేసినట్లు బాబు మోహన్ చెప్పారు. హీరోగా అవకాశాలు వచ్చినా నటుడిగా చాలా సినిమాలకు ఆఫర్లు రావడంతో హీరో అవకాశాలు వదులుకున్నానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

Mad Collections : ఎన్టీఆర్ బామ్మర్ది మొదటి సినిమాతో అదరగొట్టాడు.. మూడు రోజుల్లో కలెక్షన్స్..

కొడుకు ప్రమాదంలో చనిపోయినపుడు పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని.. చనిపోవాలని నిర్ణయించుకున్నానని బాబుమోహన్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తనని డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ మామూలు మనిషిని చేసారని అన్నారు. ‘ఎవడి గోల వాడిదే’ సినిమా కోసం బ్యాంకాక్ తీసుకెళ్లి తన వెంటే ఉండి తనను మామూలు మనిషిని చేసిన దేవుడు అంటూ ఈవీవీని గుర్తు చేసుకున్నారు బాబు మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న బాబూ మోహన్, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి మారారు. అక్కడ లక్ కలిసిరాక ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.