BiggBoss 6 Day 52 : వామ్మో గీతూ మరీ ఇంత శాడిజమా.. తను గెలవదు, పక్కనవాళ్ళని గెలవనివ్వదు

అందరి మీద అరిచేస్తున్న గీతూ గేమ్ లో వెనుకపడిపోవడంతో బాగా హర్ట్ అయింది. రేవంత్ వల్లే తన గేమ్ పోయిందని గీతూ అర్ధరాత్రి రేవంత్ చేపల్ని దొంగలించాలని ట్రై చేసినా........

BiggBoss 6 Day 52 : వామ్మో గీతూ మరీ ఇంత శాడిజమా.. తను గెలవదు, పక్కనవాళ్ళని గెలవనివ్వదు

BiggBoss 6 Day 52 contestants fight in captaincy task

BiggBoss 6 Day 52 :  బిగ్‌బాస్ లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. గతవారం ఎవరూ సరిగ్గా చేయకపోవడంతో బిగ్‌బాస్ సీరియస్ అయి ఏకంగా కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశాడు. దీంతో ఈ వారం అంతా రెచ్చిపోయి మరీ ఆడేస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జంటలు జంటలుగా చేపలు పట్టాలి అని ఇచ్చిన టాస్క్ లో చేపల బొమ్మల కోసం ఏకంగా కొట్టుకొని, ఒకరి మీద పడి ఒకరు లాగేసుకొని రచ్చ రచ్చ చేస్తూ ఆడుతున్నారు.

అందరి మీద అరిచేస్తున్న గీతూ గేమ్ లో వెనుకపడిపోవడంతో బాగా హర్ట్ అయింది. రేవంత్ వల్లే తన గేమ్ పోయిందని గీతూ అర్ధరాత్రి రేవంత్ చేపల్ని దొంగలించాలని ట్రై చేసినా కుదర్లేదు. ఇక మరోసారి మెరీనాతో గొడవ పెట్టుకోవడంతో నువ్వు గెలవట్లేదని ఫ్రస్టేట్ అవుతున్నావు అని అనేసింది. ఇంట్లో వాళ్ళు కూడా మెరీనా అన్నది కరక్ట్ అని అనడంతో గీతూ మరింత హర్ట్ అయింది. అయితే గీతూకి ఒక నల్ల చేప స్పెషల్ గా దొరకడంతో దాన్ని దాచుకుంది.

మళ్ళీ చేపల టాస్క్ ప్రారంభం అవడంతో ఈ సారి గీతూ, ఆదిలని సంచాలకులుగా చేశారు. అయితే గీతూ చేపలు పడుతుంటే సంచాలకులుగా ఉన్నవాళ్లు చేపలు పట్టకూడదు అని ఆది చెప్పినా పట్టించుకోలేదు. ఫైమాకి గోల్డ్ కాయిన్ దొరకడంతో నెక్స్ట్ టాస్క్ లో ఎవరెవరు ఉండొచ్చో ఫైమా నిర్ణయిస్తుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ఫైమా- రాజ్‌ తమ జోడితో పాటు సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్‌ జంటలు పోటీకి దిగుతాయని వెల్లడించారు. ఈ ఛాలెంజ్‌లో సూర్య- వాసంతి టీమ్‌ గెలిచి 15 చేపలు గెలుచుకుంది.

BiggBoss 6 Day 51 : కెప్టెన్సీ టాస్క్ కోసం ఒకరి మీద ఒకరు పడిపోయి.. తిట్లతో, అరుపులతో దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌజ్..

ఫైనల్‌గా చేపల చెరువు టాస్క్‌ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్‌ 67, రేవంత్‌- ఇనయ 129, ఫైమా- రాజ్‌ 109, సూర్య- వాసంతి 89, రోహిత్‌- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప దొరికిన వాళ్ళు రెండు జంటల చేపలను స్వాప్‌ చేయొచ్చని బిగ్‌బాస్‌ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదే టైం అనుకోని గీతూ తనకి దొరికిన నల్ల చేపని బయటకి తీయడంతో అంతా ఆశ్చర్యపోయారు. గీతూ తన శాడిజం చూపించడానికి రేవంత్ మీద ఓడిపోయాను అని రేవంత్ వాళ్ళకి ఎక్కువ చేపలు ఉండటంతో వాటిని శ్రీసత్య- శ్రీహాన్‌తో స్వాప్‌ చేస్తాను అని చెప్పింది. దీంతో గీతూ కావాలని ఇలా చేసిందని సభ్యులంతా ఫీల్ అయ్యారు. చివరగా రేవంత్‌ జోడీకి 67 చేపలు ఉండగా, శ్రీహాన్‌ జోడీకి 129 చేపలు వచ్చాయి. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట టాస్క్ నుంచి వెళ్లిపోయారు. మరి నేటి ఆటలో వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.