Mukesh Udeshi : చిరంజీవి సినిమాల నిర్మాత కన్నుమూత.. కాపాడుకోవడానికి అల్లు అరవింద్ ప్రయత్నించినా..
గత కొన్నాళ్లుగా ముకేశ్ ఉదేశి కిడ్నీ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు
Mukesh Udeshi : సినీ పరిశ్రమలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు ఇటీవల మరణించగా తాజాగా ఓ సీనియర్ నిర్మాత కన్నుమూశారు. బాలీవుడ్(Bollywood) నిర్మాత ముకేశ్ ఉదేశి కన్నుమూశారు. ఆయన మరణించిన ఒక రోజు తర్వాత ఈ వార్త బయటకి వచ్చింది.
గత కొన్నాళ్లుగా ముకేశ్ ఉదేశి కిడ్నీ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన హాస్పిటల్ ఖర్చులు అల్లు అరవింద్(Allu Aravindh) పెట్టుకుంటున్నట్టు, అల్లు అరవింద్ అయన చికిత్స గురించి చేసుకుంటున్నట్టు సమాచారం. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అల్లు అరవింద్ ముకేశ్ ఉదేశిని మళ్ళీ ఆరోగ్యంతో తీసుకురావాలనుకున్నా ఆయన మరణించారు.
Bigg Boss : బిగ్బాస్ హౌస్లో ఆ వాయిస్ ఎవరిది? బిగ్బాస్లా మాట్లాడే పర్సన్ ఎవరో తెలుసా?
ముకేశ్ ఉదేశి మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ముకేశ్ ఉదేశి మేనేజర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ గా అనేక బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. బాలీవుడ్ లో ఆర్జీవీ తెరకెక్కించిన పలు సినిమాలకు ఎగ్జిగ్యూటివ్ నిర్మాతగా కూడా పనిచేశారు. అనంతరం నిర్మాతగా మారి బాలీవుడ్ లో పలు సినిమాలు తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా హిందీలో తెరకెక్కించిన ప్రతిబంధ్, ది జెంటిల్ మ్యాన్ సినిమాలకు అల్లు అరవింద్ తో పాటు ముకేశ్ ఉదేశి కూడా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే తెలుగులో చిరంజీవి SP పరుశురాం సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ముకేశ్ ఉదేశి మరణంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది. అల్లు అరవింద్ కూడా తీవ్ర విషాదానికి లోనయ్యారు
Deeply Saddening News Indian Executive producer Mukesh Udeshi Ji has passed away. Deepest condolences to the family and loved ones. Om Shanti. #omshanti #IFTPC #SajidNadiadwala @JDMajethia #RatanJain @NitinPVaidya @RameshTaurani @nrpachisia @tsunami_singh #SureshAmin pic.twitter.com/7c4COcC6m0
— INDIAN FILM TV PRODUCERS COUNCIL (@IftpcM) September 12, 2023