బాలీవుడ్ బిజీ బిజీ

  • Published By: sekhar ,Published On : November 21, 2020 / 05:05 PM IST
బాలీవుడ్ బిజీ బిజీ

Bollywood Movie Updates: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ప్రభు దేవా కాంబోలో రూపొందిన ‘రాధే’ మూవీ రిలీజ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడడంతో ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ సినిమా గురించి వస్తున్న వార్తలు అవాస్తమని, 2021 ఈద్‌కి ‘రాధే’ ను థియేటర్లలోనే విడుదల చేస్తామని మూవీ టీం కన్ఫామ్ చేసింది.Imageరణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె జంటగా తెరకెక్కుతున్న క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ బయోపిక్ ‘83’, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటిస్తున్న ‘సూర్యవంశీ’ సినిమాలు 2021 ప్రథమార్థంలో, మార్చి 31 కి ముందుగానే విడుదల కానున్నాను.Imageగోవా బ్యూటీ ఇలియానా, రణదీప్ హుడా నటిస్తున్న ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.




‘సాండ్ కీ ఆంఖ్’, ‘ముబారకన్’ సినిమాలకు రైటర్‌గా వర్క్ చేసిన బల్వీందర్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను 2021 ప్రథమార్థంలో విడుదల చేయనున్నారు. Imageతాప్సీ పన్ను నటించిన ‘థప్పడ్’, దీపికా పదుకొణె ‘ఛపాక్’, ఆయుష్మాన్ ఖురానా ‘శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్’ చిత్రాలు అరుదైన గౌరవం లభించింది.
https://10tv.in/allu-arjun-surprise-to-his-daughter/
బెస్ట్ ఏషియన్ ఫిలిం కేటగిరీలో ప్రెస్టీజియస్ ‘ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డ్స్’ (AACTA Awards) కు నామినేట్ అయ్యాయి. ఇంతకుముందు ‘దంగల్’ ఈ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది.Imageకైరా అద్వానీ తాజా చిత్రం ‘ఇందూ కీ జవానీ’ డిసెంబర్ 11న థియేటర్లలోకి రాబోతుందని అఫీషియల్‌గా ప్రకటించారు.




ఆదిత్య సీల్ హీరోగా నటించగా, అబిర్ సేన్‌గుప్తా డైరెక్ట్ చేశారు. ఇన్నాళ్లూ లాక్‌డౌన్ కారణంగా బోసిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు మళ్లీ కళకళలాడుతోంది.