‘రౌద్రం రణం రుధిరం’- పోటాపోటీగా పొగిడారు..

‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉందంటూ స్పందన తెలియచేసిన సెలబ్రిటీలు..

  • Published By: sekhar ,Published On : March 25, 2020 / 12:15 PM IST
‘రౌద్రం రణం రుధిరం’- పోటాపోటీగా పొగిడారు..

‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ అద్భుతంగా ఉందంటూ స్పందన తెలియచేసిన సెలబ్రిటీలు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కలయికలో దర్శకధీరుడు రాజమౌళి స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్  మోషన్ పోస్టర్ ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకులు, అభిమానులు మరియు సెలబ్రిటీల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘‘మోషన్ పోస్టర్ కనువిందుగా ఉంది. నా ఒళ్లు గ‌గుర్పొడిచింది. కీర‌వాణి అద్భుత‌మై నేప‌థ్య సంగీతాన్ని అందించారు.

రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, తార‌క్ ప‌నితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అంద‌రిలో ఎన‌ర్జీని నింపారు’’ అని ట్వీట్ చేశారు. ‘సర్.. మీరు ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్షలు.. ట్విట్టర్‌కు స్వాగతం’ అంటూ రాజమౌళి రిప్లై ఇచ్చారు. ఇక కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ పాజిటివ్‌గా రెస్పాండ్ అవడం విశేషం. ‘గ్యాప్ లేకుండా డిప్రెస్సింగ్ వార్తలు వినిపిస్తున్న సమయంలో జీవితంలో రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని మాకు గుర్తుచేసినందుకు థ్యాంక్స్ రాజమౌళి.

కోవిడ్-19 లాంటి భయంకరమైన విషయాలూ ఉన్నాయి. ‘RRR’ లాంటి గొప్ప విషయాలు కూడా ఉన్నాయి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేయగా.. ‘బ్రిటిష్ ప్రభుత్వ పాలన పై కట్టలు తెంచుకున్న “రౌద్రం” (కోపం)… ! ఆ ఇద్దరు కలిసి చేయాలనుకున్న “రణం” (యుద్ధం) ఆ యుద్ధంలో వాళ్లర్పించిన “రుధిరం” (రక్తం)’ అంటూ దర్శకుడు వి.వి.వినాయక్ ట్వీట్ చేశారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు ‘రౌద్రం రణం రుధిరం’ గురించి ట్వీట్ చేశారు. తారక్ కోమురం భీమ్, చరణ్ అల్లూరిగా కనిపించనున్న ఈ సినిమాను 2021 జనవరి 8న విడుదల చేయనున్నారు.