”సరిలేరు నీకెవ్వరు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి
మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ ''సరిలేరు నీకెవ్వరు''. అనిల్ రావిపూడి డైరెక్టర్. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, జనవరి 5న ఎల్బీ
మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ ”సరిలేరు నీకెవ్వరు”. అనిల్ రావిపూడి డైరెక్టర్. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, జనవరి 5న ఎల్బీ
మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ ”సరిలేరు నీకెవ్వరు”. అనిల్ రావిపూడి డైరెక్టర్. రష్మిక మందన్న హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కాగా, జనవరి 5న ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.
“మా ఆహ్వానాన్ని మన్నించి మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి అంగీకరించినందుకు చిరంజీవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మా సినిమా ఫంక్షన్కు మీరు రావడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మీ రాకతో మా హ్యాపీనెస్ రెట్టింపు అవుతుంది. మా యూనిట్ అంతా ఈ ఫంక్షన్ను ఓ ల్యాండ్మార్క్ ఈవెంట్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. సర్, మీ రాక కోసం ఎదురుచూస్తున్నా” అని మహేష్ అన్నారు.
ఇకపోతే ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. సోమవారం(డిసెంబర్ 23,2019) విడుదల కానున్న నాలుగో పాట క్లాస్ సాంగ్గా ఉండనుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట కోసం యూరప్లోని అతి పెద్ద ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు డీఎస్పీ. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు.
సంక్రాంతి కానుకగా 2020 జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్లక్ష్మణ్, యుగంధర్ టి. ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.