Theatres: టాలీవుడ్లో రెండు పెద్ద సినిమాల విషయంలో గొడవ.. OTTలో? థియేటర్లలో?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొడవ నెలకొంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానుండగా ఒకటి థియేటర్లలో మరొకటి ఓటీటీలో రిలీజ్ కావడమే వివాదానికి కారణం..
Theatres: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొడవ నెలకొంది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కానుండగా.. ఒకటి థియేటర్లలో మరొకటి ఓటీటీలో రిలీజ్ కావడమే వివాదానికి కారణం అవుతుంది. సెప్టెంబర్ 10న థియేటర్లలో లవ్స్టోరీ విడుదల కానుండగా.. అదే రోజు ఓటీటీలో టక్ జగదీష్ విడుదల కాబోతుంది. దీంతో నిర్మాతలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లకు మద్దతివ్వాల్సిన నిర్మాతలు ఓటీటీలో సినిమాలను విడుదల చేయడం ఏంటని ఎగ్జిబిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు రేపు(20 ఆగస్ట్ 2021) తెలంగాణ థియేటర్ ఓనర్లు ప్రెస్మీట్ నిర్వహించబోతున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో నానీ హీరోగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం టక్ జగదీష్.. విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగగా.. చివరకు ఈ సినిమా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. థియేటర్కు పెద్ద ఫ్యాన్ అని, అయితే, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో నిర్మాత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని నానీ కూడా ప్రకటించేశారు.
ఇప్పుడిప్పుడే థియేటర్లలో వరుస సినిమాలు విడుదలవుతుంటే, థియేటర్లకు మద్దతివ్వాల్సిన నిర్మాతలు ఓటీటీని ఆశ్రయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు థియేటర్ల యాజమాన్యాలు. అదేరోజు లవస్టోరీ సినిమా కూడా వచ్చేస్తుంది. అయితే, థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చెయ్యనున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవిలు జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా విడుదల తేదీని కూడా సెప్టెంబర్ 10న ఖరారు చేశారు. రిలీజ్ డేట్కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అయితే, అదే రోజు టక్ జగదీష్ థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో విడుదల అవుతుండడం ఇబ్బందిగా భావిస్తున్నారు థియేటర్ల యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు.