రజినీ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్ రివ్యూ : దర్బార్ అదిరిపోయిందట

  • Published By: vamsi ,Published On : January 9, 2020 / 06:28 AM IST
రజినీ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్ రివ్యూ : దర్బార్ అదిరిపోయిందట

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కబాలి, కాలా, 2.O, పేటా వంటి వరుస సినిమాల తరువాత రజనీకాంత్ నటించిన సినిమా దర్బార్. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ నటించిన ఈ చిత్రం ఇవాళ(09 జనవరి 2020) విడుదలైంది. దర్శకుడు ఏఆర్ మురగదాస్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారు? రజనీ మ్యాజిక్ చేశారా అని తెలుసుకోవాలంటే ఫ్యాన్స్, ఆడియెన్స్ కామెంట్స్ చూడాల్సిందే

‘దర్బార్’ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ప్రస్తుతానికి వస్తోన్న టాక్ బట్టి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. ఇంట్రడక్షన్ ఫైటే అదిరిపోయిందట. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ఓ రేంజ్‌లో పరిగెత్తిందని అంటున్నారు. ఒక్క సెకన్ కూడా బోర్ అనేది లేకుండా రేసీ స్క్రీన్ ప్లేతో అలరించారట దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ఇక రజినీకాంత్ అయితే తన పవర్‌ఫుల్ యాక్షన్‌తో కట్టిపడేశారట. మళ్లీ అలనాటి రజినీని చూశామని అభిమానులు అంటున్నారు.

దర్బార్ చిత్ర్ంలో ప్రేక్షకులకు ఏం కావాలో, తనకు బాగా పట్టున్న అంశాలైన మైండ్ గేమ్, ఇంటెలిజెన్స్ సినిమాను రసవత్తరంగా తెరకెక్కించారు. వీర లెవెల్ మూవీ. పేట్టను ఆకాశానికి ఎత్తిన వాళ్లు దర్బార్ సినిమా చూడాలి. అప్పుడే తెలుస్తుంది రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మ్యాజిక్ చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్లే, సెంటిమెంట్, స్టార్ పవర్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. రజనీ ఎంట్రీ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆయన ఎంట్రీ అదరగొట్టింది అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

రజినీకాంత్ ఎంట్రీ, అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవని రజినీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ చాలా సరదాగా, రొమాంటిక్‌గా, క్రేజీగా సాగిపోయిందని కొందరు ట్వీట్లు చేశారు. విలన్ సునీల్ శెట్టి పరిచయంతో ఇంటర్వెల్ కార్డ్ పడిందట. ఫస్టాఫ్ మొత్తం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో విపరీతంగా ఆకట్టుకుంటుందని టాక్. ఇక సెకండాఫ్‌లో అసలు స్టోరీ మొదలవుతుందట. యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్‌తో కట్టిపడేశారట దర్శకుడు మురుగదాస్. నివేదా థామస్‌తో రజినీకాంత్ సీన్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయట. నయనతార, రజినీ జంట వెండితెరపై చూడముచ్చటగా ఉందట. ఈ విషయాన్ని మరో నెటిజన్ వెల్లడించారు.