Prabhas: “ధృవ” కథ ప్రభాస్ కోసం రాశా.. మోహన్ రాజా!

"హనుమాన్ జంక్షన్" సినిమాతో వెండితెరకు డైరెక్టర్ గా పరిచయమైన మోహన్ రాజా. ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి వరుస సినిమాలు తీస్తూ హిట్టు మీద హిట్టు అందుకున్న ఈ దర్శకుడు, దాదాపు 22 ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి తిరిగి వచ్చిన ఈ దర్శకుడు. చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

Prabhas: “ధృవ” కథ ప్రభాస్ కోసం రాశా.. మోహన్ రాజా!

Dhruva Movie Story Written For Prabhas

Prabhas: “హనుమాన్ జంక్షన్” సినిమాతో వెండితెరకు డైరెక్టర్ గా పరిచయమైన మోహన్ రాజా. ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి వరుస సినిమాలు తీస్తూ హిట్టు మీద హిట్టు అందుకున్న ఈ దర్శకుడు, దాదాపు 22 ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి తిరిగి వచ్చిన ఈ దర్శకుడు. చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

Prabhas: నా అభిమానులకు నచ్చితే చాలు – ప్రభాస్

దర్శకుడు మోహన్ రాజా అతని సోదరుడు ‘జయం రవి’తో తెరకెక్కించిన “తని ఒరువన్” తమిళనాట ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ‘ధృవ‘ పేరుతో ఆ సినిమాను రాంచరణ్ రీమేక్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ‘తని ఒరువన్’ కథ ముందుగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కోసం రాసాడట డైరెక్టర్.

కానీ కొన్ని కారణాల వాళ్ళ అది సెట్స్ వరకు వేళ్ళ లేదట. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ లో ఇస్తున్న ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఆ సినిమా డార్లింగ్ కు పడుంటే ఇంకో రేంజ్ లో ఉండేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మోహన్ రాజా రాంచరణ్ కోసం “ధృవ-2″ కథని సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.