Prabhas: నా అభిమానులకు నచ్చితే చాలు – ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. తాజాగా ఆదిపురుష్ 3D టీజర్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఈ టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Prabhas: నా అభిమానులకు నచ్చితే చాలు – ప్రభాస్

Prabhas Comments At Adipurush 3D Teaser Screening

Prabhas: యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే కొందరు మాత్రం ఈ టీజర్‌పై నెగెటివ్ కామెంట్స్ చేశారు.

Prabhas : రావణ దహనం చేసిన ప్రభాస్.. ప్రభాస్‌నే ఎందుకు పిలిచారో చెప్పిన రాంలీలా కమిటీ..

కాగా, తాజాగా ఆదిపురుష్ 3D టీజర్‌ను చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఈ టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాను ఎంతో కష్టపడి తీశామని.. అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా తన అభిమానులకు నచ్చితే చాలని.. వారికి నచ్చే విధంగా సినిమాలు చేస్తూ ఉంటానని ప్రభాస్ అన్నాడు. ఈ త్రీడి టీజర్ లాంచ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా, ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఓం రావుత్‌తో పాటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

Prabhas : ఆదిపురుష్ సినిమా ఒప్పుకోవడానికి మూడు రోజులు ఆలోచించాను.. రాముడే ఈ సినిమా చేయించాడు..

ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇక లంకేశ్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.