Prabhas : రావణ దహనం చేసిన ప్రభాస్.. ప్రభాస్నే ఎందుకు పిలిచారో చెప్పిన రాంలీలా కమిటీ..
విజయదశమి నాడు ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీం సందడి చేసింది. ప్రభాస్తో పాటు దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ లీలా కమిటీ ప్రభాస్ ని సత్కరించిన తర్వాత...........
Prabhas : దసరా సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో రామ్ లీలా వేడుకలు, రావణ దహనం జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు జరగకపోవడంతో ఈ సారి మరింత ఘనంగా ఈ రామ్ లీలా వేడుకలు నిర్వహించారు. ఈ సారి రావణ దహనం మన ప్రభాస్ చేతుల మీదుగా జరిపించారు.
దీంతో విజయదశమి నాడు ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఆదిపురుష్ టీం సందడి చేసింది. ప్రభాస్తో పాటు దర్శకుడు ఓం రౌత్, నిర్మాతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ లీలా కమిటీ ప్రభాస్ ని సత్కరించిన తర్వాత విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు సంధించాడు. ఈ కార్యక్రమం అయిన తర్వాత రామావతారంలో ఉన్న నటులకి డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్ కలిసి హారతి ఇచ్చారు. రామ్ లీలా మైదానంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
Adipurush : వందల కోట్లు పెట్టి ఇతిహాసాలని ఇలా చెడగొట్టకండి.. ‘ఆదిపురుష్’పై ఫైర్ అయిన శక్తిమాన్..
కార్యక్రమం అనంతరం లవ్ కుశ్ రామ్లీలా కమిటీ ప్రెసిడెంట్ అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ”తెలుగులోనే కాక దేశం మొత్తం ప్రభాస్ పేరు, ప్రఖ్యాతలు సంపాదించారు. భారత చరిత్ర కథలని ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు. మొన్న బాహుబలి, ఇప్పుడు ఆదిపురుష్ లాంటి కథలని ఎంచుకొని భారతదేశ చరిత్రని అందరికి తెలియచేస్తున్నారు. భారత సంస్కృతి పై అయ్యన్న అభిమానం చూసే ఈ కార్యక్రమానికి పిలిచాము” అని తెలిపారు.