Prabhas : ఆదిపురుష్ సినిమా ఒప్పుకోవడానికి మూడు రోజులు ఆలోచించాను.. రాముడే ఈ సినిమా చేయించాడు..
ప్రభాస్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయోధ్యకు వచ్చి శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నాం. నాకు ఓం రౌత్ కథ వినిపించాక ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట భయం వేసింది. సినిమా..................
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ అప్డేట్ ఆదివారం(అక్టోబర్ 2న) సాయంత్రం ఇచ్చేశారు. అయోధ్యలో గ్రాండ్గా జరిగిన ఆదిపురుష్ ఈవెంట్లో టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక టీజర్ చూడటానికి చాలా బాగుంది. రామాయణాన్ని కొత్తగా చూపించడానికి ఓం రౌత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయోధ్యలో జరిగిన ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అయోధ్యకు వచ్చి శ్రీరాముడు ఆశీర్వాదం తీసుకున్నాం. నాకు ఓం రౌత్ కథ వినిపించాక ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట భయం వేసింది. సినిమా ఒప్పుకోవడానికి మూడు రోజులు ఆలోచించి ఓకే చెప్పాను. దేవుడు మీద ఉన్న భక్తి, ప్రమే, భయమే నన్ను ఈ సినిమా చేయించింది. రాముడిని మనం దేవుడుగా విశ్వసిస్తాం. రాముడే నాతో ఈ సినిమా చేయించాడేమో అనిపిస్తుంది” అని అన్నారు. ఇక ఆదిపురుష్ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది.