Director Madan : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ..
సిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ ని మొదలుపెట్టి రచయితగా మారారు మదన్. ఆ నలుగురు సినిమాతో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా............
Director Madan : అసిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ ని మొదలుపెట్టి రచయితగా మారారు మదన్. ఆ నలుగురు సినిమాతో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో దర్శకుడిగా మారారు మదన్. ఆ తర్వాత గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి వంటి సినిమాలని తెరకెక్కించారు.
Varisu : తమిళ్, తెలుగు ఇండస్ట్రీల మధ్య చిచ్చు పెట్టిన ‘వరిసు’
గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మదన్ బ్రెయిన్ స్ట్రోక్కు గురవ్వగా కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి మరణించారు. దీంతో పలువురు టాలివుడ్ ప్రముఖులు మదన్ కి నివాళులు అర్పిస్తున్నారు.
‘ఆ నలుగురు’తో రచయితగా గుర్తింపు పొంది, ‘పెళ్లయిన కొత్తలో’తో దర్శకుడిగా మారిన మదన్ 4 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి’ కి దర్శకత్వం వహించారు.#Madan pic.twitter.com/3X4ASMQtKA
— Omprakash Narayana Vaddi (@omprakashvaddi) November 19, 2022