Indira Devi: ఇందిరా దేవి మృతిపై చిరంజీవి.. సినీ ప్రముఖుల సంతాపం
మహేశ్ బాబు మాతృమూర్తి, ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మెగాస్టార్’ చిరంజీవితోపాటు, దర్శకులు శ్రీను వైట్ల, బాబీ, టీడీపీ నేత నారా లోకేష్ వంటి ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Indira Devi: మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతిపై చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణ వార్త తనను ఎంతగానో కలచి వేసిందని చిరంజీవి అన్నారు. కృష్ణ, మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఇందిరమ్మ ఆత్మకు శాంతి కలగాలని నిర్మాత బండ్ల గణేష్, గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.
Mahesh Babu: అమ్మ చేతి కాఫీ.. దేవుడి ప్రసాదంతో సమానమన్న మహేశ్ బాబు
ఇందిరమ్మ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని దర్శకుడు బాబీ అన్నారు. ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు. దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు వీకే నరేష్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు సంతాపం ప్రకటించారు.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ ?, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ? pic.twitter.com/Dgkiorz6Yh
— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2022
I was devastated by the tragedies in Super Star Krishna garu’s family and the demise of Srimathi Indiramma garu struck me very hard. I have great admiration for this affectionate family and highest respect for Indiramma garu.
— Sreenu Vaitla (@SreenuVaitla) September 28, 2022
మీకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన అమ్మగారు వెళిపోయారన్న వార్త చాలా బాధాకరం @urstrulyMahesh గారు .
వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను??? pic.twitter.com/5MtnZsPRQA— RamajogaiahSastry (@ramjowrites) September 28, 2022