ఎమ్మీ అవార్డ్స్ 2019 : అవార్డ్ రాలేదు కానీ క్రేజ్ మాత్రం వచ్చింది..

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ 'ఎమ్మీ' అవార్డ్స్ 2019 కార్యక్రమం న్యూయార్క్‌లో సోమవారం(నవంబర్​ 25న) ఘనంగా జరిగింది..

  • Published By: sekhar ,Published On : November 26, 2019 / 12:11 PM IST
ఎమ్మీ అవార్డ్స్ 2019 : అవార్డ్ రాలేదు కానీ క్రేజ్ మాత్రం వచ్చింది..

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఎమ్మీ’ అవార్డ్స్ 2019 కార్యక్రమం న్యూయార్క్‌లో సోమవారం(నవంబర్​ 25న) ఘనంగా జరిగింది..

అవార్డులనేవి కళాకారులకు ప్రేక్షకుల నుండి లభించే రివార్డులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అవార్డుల కార్యక్రమాల కోసం సినిమా పరిశ్రమతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సినిమాలకు ఆస్కార్​ అవార్డులు ప్రతిష్టాత్మకమైనవి. మరి టీవీ షోలు, సీరియల్స్​ పరిస్థితి ఏంటీ.? అందుకే వాటికీ పురస్కారాలు ఉన్నాయి. అవే ‘ఎమ్మీ అవార్డ్స్​’. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2019 కార్యక్రమం న్యూయార్క్‌లో సోమవారం(నవంబర్​ 25న) ఘనంగా జరిగింది. 

View image on Twitter
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఎమ్మీ’ అవార్డులకు ఈ ఏడాది నామినేట్​ అయింది బాలీవుడ్​ నటి రాధికా ఆప్టే.  ఈ ఏడాది ఈ అవార్డుల కోసం మూడు ప్రాజెక్టులు..  ‘సేక్రెడ్​ గేమ్స్’​, ‘లస్ట్​ స్టోరీస్’​, ‘ది రీమిక్స్’​ నామినేషన్లలో నిలిచాయి. దురదృష్ట వశాత్తు బాలీవుడ్ సెలబ్రిటీలు అవార్డ్స్ గెలుచుకోలేక పోయారు కానీ రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటించిన ‘సేక్రెడ్​ గేమ్స్​’ సీజన్2 ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేట్ అయింది.

Image result for emmy awards 2019

 

లస్ట్ స్టోరీస్​లో నటనకు గానూ… బెస్ట్ పెర్ఫార్మెన్స్ విభాగంలో రాధిక నామినేట్ అయింది. తాజాగా నామినేషన్​కు సంబంధించిన పతకం, ప్రశంసా పత్రాలను అందుకుందీ అందాల భామ. వాటితో తీసుకున్న ఫొటోలను అభిమానులతో షేర్​ చేసుకుంది. 11 కేటగిరీల్లో 21 దేశాలకు చెందిన చిత్రాలు అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. 

u76dphfg