ఎమ్మీ అవార్డ్స్ 2019 : అవార్డ్ రాలేదు కానీ క్రేజ్ మాత్రం వచ్చింది..
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ 'ఎమ్మీ' అవార్డ్స్ 2019 కార్యక్రమం న్యూయార్క్లో సోమవారం(నవంబర్ 25న) ఘనంగా జరిగింది..
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఎమ్మీ’ అవార్డ్స్ 2019 కార్యక్రమం న్యూయార్క్లో సోమవారం(నవంబర్ 25న) ఘనంగా జరిగింది..
అవార్డులనేవి కళాకారులకు ప్రేక్షకుల నుండి లభించే రివార్డులు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అవార్డుల కార్యక్రమాల కోసం సినిమా పరిశ్రమతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సినిమాలకు ఆస్కార్ అవార్డులు ప్రతిష్టాత్మకమైనవి. మరి టీవీ షోలు, సీరియల్స్ పరిస్థితి ఏంటీ.? అందుకే వాటికీ పురస్కారాలు ఉన్నాయి. అవే ‘ఎమ్మీ అవార్డ్స్’. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2019 కార్యక్రమం న్యూయార్క్లో సోమవారం(నవంబర్ 25న) ఘనంగా జరిగింది.
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఎమ్మీ’ అవార్డులకు ఈ ఏడాది నామినేట్ అయింది బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ఈ ఏడాది ఈ అవార్డుల కోసం మూడు ప్రాజెక్టులు.. ‘సేక్రెడ్ గేమ్స్’, ‘లస్ట్ స్టోరీస్’, ‘ది రీమిక్స్’ నామినేషన్లలో నిలిచాయి. దురదృష్ట వశాత్తు బాలీవుడ్ సెలబ్రిటీలు అవార్డ్స్ గెలుచుకోలేక పోయారు కానీ రెడ్ కార్పెట్పై నడుస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ సీజన్2 ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేట్ అయింది.
లస్ట్ స్టోరీస్లో నటనకు గానూ… బెస్ట్ పెర్ఫార్మెన్స్ విభాగంలో రాధిక నామినేట్ అయింది. తాజాగా నామినేషన్కు సంబంధించిన పతకం, ప్రశంసా పత్రాలను అందుకుందీ అందాల భామ. వాటితో తీసుకున్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. 11 కేటగిరీల్లో 21 దేశాలకు చెందిన చిత్రాలు అవార్డుల కోసం పోటీపడుతున్నాయి.