Janhvi Kapoor : శ్రీదేవి హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుందాం అనుకుంది.. సౌత్ సినిమాల్లో ఛాన్స్ వస్తే నటిస్తాను..

ఈ ప్రెస్ మీట్ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ..''మిలీ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. 22 రోజులపాటు కోల్డ్ స్టోరేజ్ లో షూట్ చేశాం. ఫ్రీజర్ లో షూట్ చేయడం అంత టఫ్ గా ఉంటుంది అని నాకు ముందు తెలీదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో............

Janhvi Kapoor : శ్రీదేవి హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుందాం అనుకుంది.. సౌత్ సినిమాల్లో ఛాన్స్ వస్తే నటిస్తాను..

Janhvi Kapoor and bony kapoor speeches in mili movie promotions at hyderabad

Janhvi Kapoor :  శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ కంటెంట్ ఓరియెంట్ సినిమాలు చేస్తుంది. కమర్షియల్ సైడ్ కి వెళ్లకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం జాన్వీ మిలీ అనే సినిమాతో రాబోతుంది. మలయాళ సినిమా హెలెన్ కి రీమేక్ ఇది. ఇటీవల బాలీవుడ్ సినిమాలన్నీ తెలుగు మార్కెట్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిలీ సినిమాని టాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ, బోని కపూర్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్ మీట్ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ..”మిలీ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. 22 రోజులపాటు కోల్డ్ స్టోరేజ్ లో షూట్ చేశాం. ఫ్రీజర్ లో షూట్ చేయడం అంత టఫ్ గా ఉంటుంది అని నాకు ముందు తెలీదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా సినిమాకి కొత్తదనం కోరుకుంటునన్ను కాబట్టే కొత్త కొత్త కథలతో వస్తున్నాను. కామెడీ సినిమాలు, ఫుల్ లవ్ స్టొరీ సినిమాలు చేయాలని ఉంది. సౌత్ సినిమాలలో యాక్ట్ చేయడం నా డ్రీమ్. మా అమ్మ సౌత్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అవకాశం వస్తే సౌత్ సినిమాల్లోనూ నటిస్తాను. ప్రస్తుతానికి సౌత్ లో ఇంకా ఏ సినిమాకి సైన్ చేయలేదు. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం” అని తెలిపింది.

BiggBoss 6 Day 59 : ఈ సారి ఏకంగా కంటెస్టెంట్స్‌కి కర్రలు ఇచ్చి కొట్టుకోమన్న బిగ్‌బాస్

ఇక మిలీ సినిమా నిర్మాత, శ్రీదేవి భర్త బోని కపూర్ మాట్లాడుతూ.. ”హైదరాబాద్ తో మా ఫ్యామిలికి విడదీయరాని బంధం ఉంది. హైదరాబాద్ కి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చాలా సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ చాలా మారుతూనే ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ లో శ్రీదేవి, నేను కలిసి ఇల్లు కూడా కొందాం అనుకున్నాము. కానీ కుదరలేదు. తెలుగు ప్రజలు శ్రీదేవిని ఎంతగానో ఆదరించారు. శ్రీదేవి లాగే జాన్వీని కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాను. మిలీ సినిమా కోసం జాన్వీ కి ఇంతకు ముందు తాను తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చాను.